Telangana: తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యనా..!

Telangana: తెలంగాణలో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కొలువై యేడాది పూర్తి కానున్న నేపథ్యంలో పంచాయితీ ఎన్నికలు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో    గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇటు  ప్రభుత్వం, అటు రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర కసరత్తు చేస్తున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 29, 2024, 09:45 AM IST
Telangana: తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యనా..!

Telangana: తెలంగాణ గ్రామ పంచాయితీకి చెందిన ఎన్నికలను వచ్చే జనవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే జనవరి రెండో వారంలో షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి, మూడు దశల్లో ఎన్నికలు పూర్తిచేసేలా పక్కాగా  ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే కులగణన 95శాతానికి పైగా పూర్తిచేసిన ప్రభుత్వ యంత్రాంగం డాటా ఎంట్రీ చేసే పనిలో బిజీగా ఉంది. వారంలో కులాల వారీగా వివరాలు ప్రభుత్వానికి అందజేసే అవకాశముంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ ల పదవీకాలం ముగియగా..గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. దాంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. కులగణన తర్వాత లోకల్ బాడీల్లో బీసీల రిజర్వేషన్లు పెంచి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. దాని ప్రకారం కులగణన ప్రక్రియలో భాగంగా సర్వేను దాదాపు పూర్తి చేసింది. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ ను నియమించగా.. జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరణ చేస్తున్నది.

రాష్ట్రంలో 32 జిల్లాలు, 538 మండలాల పరిధిలో 12,867 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,67,33,584 ఓటర్లు ఉండగా.. అందులో పురుషు ఓటర్లు 82,04,518 మంది, మహిళా ఓటర్లు 85,28,573 మంది, ట్రాన్స్ జెండర్స్  ఓటర్లు  493 మంది ఉన్నారు. ఒక దశలో నాలుగు వేల పంచాయతీల చొప్పున మూడు దశల్లో ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడినా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులన్న నిబంధనను ఎత్తివేయాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయించింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో లేని ఈ నిబంధనను పంచాయతీ ఎన్నికల్లో అమలు చేయడంపై రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.  ప్రజాసేవకు పిల్లల నిబంధన ఎందుకని నాయకులు కొంత కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా మండలంలో కనీసం ఐదుగురు ఎంపీటీసీలు ఉండేలా నిబంధన తీసుకురానున్నట్లు తెలిసింది.  ఈ అంశంపై ప్రభుత్వానికి లేఖ రాయగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఈ రెండు అంశాలపై వచ్చే నెలలో  జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీ రాజ్​ చట్టంలో మార్పు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x