Kamareddy Accident: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు దుర్మరణం

Kamareddy Accident: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2021, 03:23 PM IST
  • కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • లారీని ఢీకొన్న కారు
  • ఆరుగురి మృతి, మృతుల్లో ఇద్దరు చిన్నారులు
Kamareddy Accident: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు దుర్మరణం

Kamareddy Accident: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. జిల్లాలోని బిచ్కుంద మండలం జగన్నాథ్​పల్లి గేట్​ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. 

అసలేం జరిగిందంటే...
కారులో 12 మంది నాందేడ్‌ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్నారు. కామారెడ్డి జిల్లా(Kamareddy district)బిచ్కుంద మండల జగన్నాథ్‌పల్లి గేట్ వద్దకు రాగానే అదుపుతప్పిన వాహనం అక్కడే ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు క్షతగాత్రులను బాన్సువాడ, నిజామాబాద్‌ ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: Hanamkonda: హనుమకొండ జిల్లాలో విషాదం...క్వారీలో టిప్పర్ బోల్తా.. ముగ్గురు దుర్మరణం

అతి వేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు(Police) భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా వారి వివరాలను తెలుసుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News