పెన్షన్‌దారులకు తీపి కబురు చెప్పిన కేసీఆర్

మరో 15 రోజుల్లో పూర్తి వివరాలు.. 

Last Updated : Oct 4, 2018, 10:48 PM IST
పెన్షన్‌దారులకు తీపి కబురు చెప్పిన కేసీఆర్

త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో పర్యటిస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విభిన్న వర్గాల వారికి పలు శుభవార్తలు వినిపిస్తున్నారు. ఇవాళ నల్గొండలో జరిగిన సభలో పాల్గొన్న కేసీఆర్.. అదే వేదికపై నుంచి పెన్షన్‌దారులకు ఓ గుడ్ న్యూస్ వినిపించారు. పేదోళ్లకు కడుపు నిండా అన్నం పెట్టడమే తన ధ్యేయమని చెబుతూ.. అందుకోసం అవసరమైన మోతాదులో పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. పెన్షన్ల పెంపుపై అధ్యయనం కోసం కమిటీ కూడా ఏర్పాటు చేశామని... మరో 15 రోజుల్లో పెన్షన్‌దారులకు పూర్తి శుభవార్త వెల్లడిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టంచేశారు. 

పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలంటే ఎంత పెన్షన్ అవసరం అవుతుందో అంత పెంచడానికి తాము వెనుకడుగు వేయబోమని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
 

Trending News