COVID-19 Positive Cases: తెలంగాణలో తాజాగా 2500 చేరువలో పాజిటివ్ కేసులు

Telangana COVID-19 Positive Cases Latest News | తెలంగాణలో దాదాపు 2500 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,21,182కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ శుక్రవారం(ఏప్రిల్ 9న) ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 9, 2021, 11:21 AM IST
COVID-19 Positive Cases: తెలంగాణలో తాజాగా 2500 చేరువలో పాజిటివ్ కేసులు

కరోనా వైరస్ రెండో దశలో తెలంగాణలో పెను ప్రభావాన్ని చూపుతోంది. ఏప్రిల్ నెలలో దేశంలో కరోనా మహమ్మారి పలు రాష్ట్రాలలో కలకలం రేపుతోంది. తెలంగాణలో దాదాపు 2500 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తాజాగా 2,478 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,21,182కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ శుక్రవారం(ఏప్రిల్ 9న) ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

తెలంగాణలో గురువారం రాత్రి 8 గంటల వరకు గత 24 గంటల్లో 1,01,986 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో రెండు వేల నాలుగు వందల డెబ్భై ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా వైరస్(CoronaVirus) పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 21 వేల 182కు చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ నిన్న మరో అయిదుగురు వ్యక్తులు చనిపోయారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,746కి చేరింది.

Also Read: New Coronavirus Symptoms: కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇవే, కనిపిస్తే టెస్టులు తప్పనిసరి

దేశంలో ఎన్నడూ లేని విధంగా గత కొన్ని రోజులుగా లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కన్నా అయిదు రెట్లు అధికంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లోనూ కరోనా భయాందోళన పెరుగుతోంది. గురువారం ఒక్కరోజు రాష్ట్రంలో చికిత్స అనంతరం కోవిడ్-19 నుంచి 363 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,03,964 మంది కరోనా మహమ్మారిని జయించారు. 

Also Read: CoronaVirus Cases In India: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగడానికి కారణాలివే, ఈ జాగ్రత్తలు పాటించండి

తాజా కోవిడ్-19 పాజిటివ్ కేసులలో అధికంగా జీహెచ్ఎంసీలోనే నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోనే ఏకంగా 402 కరోనా కేసులు నమోదు కావడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పలు ప్రాంతాల్లో మాస్కులు లేకపోతే రూ.1000 జరిమానా విధిస్తూ కోవిడ్-19(COVID-19) నిబంధనలు కఠినతరం చేసినా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 15,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 9,674 మంది చికిత్స పొందుతున్నారు.

Also Read: COVID-19 Vaccination: కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇది చదవండి, సులువైన విధానం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News