TS: కొత్త సెక్రటేరియట్ కు 4 వందల కోట్లు

తెలంగాణ నూతన అధునాత సచివాలయ ( Telangana New Secretariat )నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి ప్రభుత్వం 4 వందల కోట్ల రూపాయల్ని మంజూరు చేయడమే కాకుండా..టెండర్ నోటిఫికేషన్లకు రంగం సిద్ధం చేస్తోంది.

Last Updated : Aug 6, 2020, 04:27 PM IST
TS: కొత్త సెక్రటేరియట్ కు 4 వందల కోట్లు

తెలంగాణ నూతన అధునాత సచివాలయ ( Telangana New Secretariat )నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి ప్రభుత్వం 4 వందల కోట్ల రూపాయల్ని మంజూరు చేయడమే కాకుండా..టెండర్ నోటిఫికేషన్లకు రంగం సిద్ధం చేస్తోంది.

తెలంగాణలోని 132 ఏళ్ల చరిత్ర ఉన్న పాత సెక్రటేరియన్ భవనాన్ని( Demolished the old secretariat building in telangana ) కూల్చివేశారు. కోర్డు అడ్డంకుల్ని అధిగమించి కూల్చివేతను పూర్తి చేశారు. ఇప్పుడిక కొత్త హంగులతో అధునాతనమైన సెక్రటేరియట్ భవన నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉంది. కొత్త సెక్రటేరియట్ భవనం కోసం ప్రభుత్వం తాజాగా 4 వందల కోట్ల రూపాయల్నిమంజూరు చేసింది. దీనికోసం ఆర్ అండ్ బీ శాఖ నుంచి పరిపాలనాపరమైన అనుమతులు జారీ కానున్నాయి. అంతేకాకుండా ఒకట్రెండు రోజుల్లోనే టెండర్ల ప్రక్రియకు నోటిఫికేషన్ వెలువడనుంది. కొత్త భవన నిర్మాణం కోసం రాష్ట్ర కేబినెట్ ( Ts Cabinet ) ఆమోదం తెలిపిన నేపధ్యంలో చెన్నై ఆర్కిటెక్ట్ ఆస్కార్, పొన్నిలతో తెలంగాణ అధికారులు భేటీ అయ్యారు. 

కొత్త సచివాలయంలో అన్ని సౌకర్యాలూ ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ( Cm kcr ) ఆదేశించారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి, కార్యదర్శులు, సలహాదార్ల ఛాంబర్లు అన్ని సౌకర్యాలతో ఉండాలని సూచించారు. ప్రతి అంతస్థులో డైనింగ్ హాలు, మీటింగ్ హాలు, వెయిటింగ్ హాలు ఉండాలని..వాహనాలన్నింటికీ పార్కింగ్ ఉండాలని కేసీఆర్ తెలిపారు. Also read: TRS ఎమ్మెల్యే మరణంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Trending News