Telangana: 20 అంబులెన్స్‌లు అందించిన జీ సంస్థ

దేశమంతటా కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిత్యం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో క‌రోనా మ‌హ‌మ్మారికి వ్య‌తిరేకంగా పోరాడుతున్న తెలంగాణ ప్ర‌భుత్వానికి ( Telangana Govt ) సాయం చేసేందుకు జీ (ZEE) సంస్థ ముందుకు వచ్చింది.

Last Updated : Aug 17, 2020, 05:26 PM IST
Telangana: 20 అంబులెన్స్‌లు అందించిన జీ సంస్థ

Zee Media donates 20 ambulances: హైద‌రాబాద్: దేశమంతటా కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిత్యం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో క‌రోనా మ‌హ‌మ్మారికి వ్య‌తిరేకంగా పోరాడుతున్న తెలంగాణ ప్ర‌భుత్వానికి ( Telangana Govt ) సాయం చేసేందుకు జీ (ZEE) సంస్థ ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్ర‌భుత్వానికి 20 అంబులెన్స్‌లు, 4 వేల పీపీఈ కిట్ల‌ను విరాళంగా అందించి జీ సంస్థ ( Zee Media ) ఉదారతను చాటుకుంది. తెలంగాణకు అందించిన అంబులెన్స్‌ల‌ను మునిసిపల్. ఐటీశాఖ మంత్రి కే. తారక రామారావు ( KTR ) ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సోమ‌వారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో జీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ గూడూరు ( Anuradha Gudur ), సంస్థకు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ జీ సంస్థ‌కు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వానికి జీ సంస్థ 20 అంబులెన్స్‌లు విరాళంగా అందించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ప్ర‌భుత్వానికి ఈ సాయం ఎంతో ఉప‌శ‌మ‌నాన్ని ఇస్తుంద‌ని ఈ మేరకు జీ సంస్థను అభినందిస్తున్నట్లు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ మేరకు ఆయన జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ సీఈవో పునిత్ గోయంక ( Punit Goenka ) జీ కార్పోరెట్ ( zee corporate) జీ టీవీ తెలుగు ( ZeeTV Telugu ) కు ధన్యవాదాలు తెలిపారు. Also read: JEE, NEET: పరీక్షలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x