CM Jagan Mohan Reddy: కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ హాట్ కామెంట్స్

CM Jagan on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తున్నాడంటూ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అనకాపల్లి సభలో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని అన్నారు. 

Written by - Ashok Krindinti | Last Updated : Mar 7, 2024, 03:57 PM IST
CM Jagan Mohan Reddy: కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ హాట్ కామెంట్స్

CM Jagan on Pawan Kalyan: మహిళా దినోత్సవం ముందురోజు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. 58 నెలల పరిపాలనలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందుడుగు వేశామన్నారు. గురువారం అనకాపల్లిలో జరిగిన భారీగా బహిరంగ సభలో ‘వైఎస్సార్‌ చేయూత’ నాలుగో విడత నిధులను బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. అక్కచెల్లెమ్మల సాధికారితకు దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా చేయూత అందించామని చెప్పారు. YSR‌ చేయూత పథకంతో ప్రతీ మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరిందన్నారు. 14 రోజుల పాటు చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు.

Also Read: No Water Supply : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈనెల 9, 10 తేదీల్లో నీటి సరఫరా బంద్..

అమ్మఒడి పథకంతో 53 లక్షల మంది తల్లులకు తమ ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు సీఎం జగన్. పిల్లల చదువుల కోసం ఈ స్థాయిలో అండగా నిలిచిన ప్రభుత్వం మరెక్కడా లేదని చెప్పారు. గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసిన చరిత్రే లేదని అన్నారు. వైఎస్సాఆర్‌ చేయూత వంటి పథకాలను గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు. నామినేటెడ్‌ పోస్టుల్లోనూ మహిళా రిజర్వేషన్లు కల్పించామని.. మహిళల రక్షణ కోసం దిశా యాప్‌, దిశా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఇలాంటి మంచి పనులు జరిగాయా..? అని.. ఎక్కడ లంచాలు లేకుండా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని వెల్లడించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు. బాబు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయని.. పొదుపు సంఘాలకు చేసిన దగా కనిపిస్తుందన్నారు. ఇక దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడని ఎద్దేవా చేశారు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారరు. వీరిద్దరూ కలిసి 2014లో వాగ్ధానాలు ఇచ్చి మోసం చేశారని.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ మోసం చేశారని ఫైర్ అయ్యారు. 

2014లో చంద్రబాబు ఒక్క వాగ్ధానం కూడా అమలు చేయలేదని.. మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడని సీఎం జగన్ ధ్వజమెత్తారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ను నడిపించాడని గుర్తుచేశారు. చంద్రబాబును నమ్మడం అంటే.. కాటేసే పామును నమ్మడమేనని.. బాబు-పవన్‌ను నమ్మడం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమేనన్నారు. మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు, పవన్ ప్రజలను మోసం చేసేందుకు వస్తారని.. కేజీ బంగారం, ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తామంటారని అన్నారు. 

Also Read: Cobra Snake: ధైర్య సాహసాలతో మనుమరాలిని కాపాడిన నాన్నమ్మ నాగుపాముకు బలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News