ఏపీ సీఎం చంద్రబాబును కలవడంపై స్పందించిన పవన్ కల్యాణ్

ఏపీ సీఎం చంద్రబాబును అందుకే పలకరించాను: పవన్ కల్యాణ్

Last Updated : Jun 24, 2018, 11:37 AM IST
ఏపీ సీఎం చంద్రబాబును కలవడంపై స్పందించిన పవన్ కల్యాణ్

తాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడంపై వైఎస్సార్సీపీ, టీడీపీ నేతలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఉంటున్నప్పుడు పలు ప్రజా సంబంధిత కార్యక్రమాలకు వెళ్లినప్పుడు అక్కడ తారసపడిన నేతలను పలకరించడం మర్యాదపూర్వకంగానే భావిస్తానే తప్ప ఇందులో రాజకీయం ఉండబోదు. ఇటువంటి సందర్భాల్లో రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. తాను వివిధ సందర్భాల్లో వివిధ నేతలతో భేటీ అయినంతమాత్రాన్నే దానితో ఏదో జరిగిపోతుందని ఊహించుకోవద్దని పవన్ తన ట్వీట్ లో విజ్ఞప్తి చేశారు. 

 

నేను పలకరించిన చాలా మంది రాజకీయ నాయకులు, నాకు నా గత రాజకీయ ప్రయాణంలో పరిచయమైన వారేనని, ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. 

Trending News