ఏపీ అసెంబ్లీ ఘటన దురదృష్టకరం: సోనూసూద్‌

ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిమాణాలపై నటుడు సోనూసూద్‌ విచారం వ్యక్తం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబును ఆయన ఫోన్‌లో పరామర్శించారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2021, 07:52 PM IST
ఏపీ అసెంబ్లీ ఘటన దురదృష్టకరం: సోనూసూద్‌

Sonu Sood Phone Call to Chandrababu: ఏపీ శాసనసభలో జరిగిన ఘటన దురదృష్టకరమని నటుడు సోనూసూద్(Sonu Sood) అన్నారు. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu Naidu)కు ఫోన్ చేసి పరామర్శించారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇలాంటి వైఖరి సరికాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తానని చంద్రబాబు(Chandrababu)తో చెప్పారు.

అసెంబ్లీలో శుక్రవారం పలువురు నేతలు తన సతీమణి భువనేశ్వరిని దూషించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఎప్పుడూ లేనంతగా భావోద్వేగానికి గురై వెక్కి వెక్కి ఏడవడం రాజకీయ, సినీ ప్రముఖుల్ని కలచివేసింది. దీనిపై పలువురు సామాజిక మాధ్యమాల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రజనీకాంత్‌(Rajinikanth) ఆదివారం ఉదయం చంద్రబాబుతో ఫోన్(Phone) ద్వారా మాట్లాడారు. 

Also Read: 'ఆడపడుచులపై పరుష వ్యాఖ్యలు.. అరాచక పాలనకు నాంది'..: జూనియర్ ఎన్టీఆర్

వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను నందమూరి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. హద్దులు దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని తమదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ ఘటన(AP Assembly incident)పై మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు(Nagababu) కూడా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు ఉండాలి తప్ప.. వ్యక్తిగత దూషణలు ఉండకూడదని అన్నారు. ఇలాంటి చెత్త సంప్రదాయానికి ఇకనైనా ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

Also Read: చంద్రబాబు-భువనేశ్వరిలకు మద్దతుగా కల్యాణ్ రామ్, నారా రోహిత్ రియాక్షన్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

 

Trending News