AP: అలిపిరితో దేవుడు బుద్ది చెప్పింది గుర్తు లేదా : ఎమ్మెల్యే రోజా

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మత రాజకీయాలపై ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. దేవుడితో రాజకీయాలు చేస్తే..మరింత పతనం తప్పదని హెచ్చరించారు.

Last Updated : Jan 7, 2021, 05:14 PM IST
AP: అలిపిరితో దేవుడు బుద్ది చెప్పింది గుర్తు లేదా : ఎమ్మెల్యే రోజా

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మత రాజకీయాలపై ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. దేవుడితో రాజకీయాలు చేస్తే..మరింత పతనం తప్పదని హెచ్చరించారు.

ఏపీ ( AP ) లో గతంలో ఎన్నడూ లేని విధంగా హిందూ ఆలయాల్ని టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతున్నాయి. తిరిగి వాటి ఆధారంగా ప్రభుత్వాన్ని( Ap Government ) ఇరుకునపెట్టే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రంలో మత రాజకీయాలకు కారణం చంద్రబాబేనని ఎమ్మెల్యే రోజా ( Mla Roja ) విమర్శించారు. గతంలో వేయి కాళ్ల మండపాన్ని కూల్చడంతో అలిపిరిలో దేవుడు ఎలా బుద్ది చెప్పాడో తెలుసని రోజా అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విజయవాడలో ఆలయాలు కూల్చినందుకే ఇవాళ ఇంతగా పతనమయ్యారని చెప్పారు. 

ఇంత జరిగినా చంద్రబాబు ( Chandrababu ) కు బుద్ది రావడం లేదని..ఇంకా మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేవాలయాల భద్రత కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) 20 వేల సీసీ కెమేరాలు పెట్టించారన్నారు. చంద్రబాబు పాలనలో ఆ పని ఎందుకు చేయలేదని రోజా ప్రశ్నించారు. అయ్యప్ప మాల వేస్తే మద్యం ఆదాయం తగ్గిపోతుందని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు హయాంలో ఆలయాలు కూల్చి..టాయిలెట్లు కట్టారని గుర్తు చేశారు. చంద్రబాబు చేయని ఆలయాల అభివృద్ధి, నిర్మాణాల్ని ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నారన్నారు.

Also read: AP: ప్రభుత్వమే లే అవుట్లు అభివృద్ధి చేసిచ్చేలా కీలక నిర్ణయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News