Stocks today: స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్- వారాంతంలో సూచీలు భళా

Stock Market News: వరుసగా మూడు రోజుల నష్టాల నుంచి తేరుకున్నాయి స్టాక్ మార్కెట్లు. శుక్రవారం సెషన్​ను భారీ లాభాలతో ముగించాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2021, 04:14 PM IST
Stocks today: స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్- వారాంతంలో సూచీలు భళా

Stock Market Update: స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడు రోజుల నష్టాలకు (Stocks closing bell) బ్రేక్ పడింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ (BSE Sensex) రికార్డు స్థాయిలో 767 పాయింట్లు బలపడి 60,686 వద్ద స్థిరపడింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజి నిఫ్టీ (NSE Nify) 229 పాయింట్లు పెరిగి 18,102 వద్ద స్థిరపడింది.

దాదాపు అన్ని రంగాలు తెరుకున్నాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్లు సహా రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. 

ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..

ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 60,750.72 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 59,997 కనష్ఠానికి పడిపోయింది.

నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 18,123 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,905 పాయింట్ల కనిష్ఠాన్ని తాకి.. చివరి దశలో కాస్త తేరుకుంది.

Also read: Flex Fuel Engines: గుడ్ న్యూస్..తగ్గనున్న పెట్రో-డీజిల్ ధరలు..లీటర్‌కు రూ.62: నితిన్ గడ్కరీ

Also read: Rakesh Jhunjhunwala: ఆకాశ ఎయిర్​ నుంచి బోయింగ్​కు రూ.75 వేల కోట్ల ఆర్డర్​?

లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..

టెక్ మహీంద్రా (Tech Mahindra Shar price) 4 శాతం, హెచ్​డీఎఫ్​సీ 2.99 శాతం, ఇన్ఫోసిస్​ 2.74 శాతం, బజాజ్ ఫిన్​సర్వ్​ 2.22 శాతం, భారతీ ఎయిర్​టెల్ (Airtel Share) 2.02 శాతం లాభాలను గడించాయి.

బజాజ్ ఆటో 3.04 శాతం, టాటా స్టీల్ (Tata Steel Share price)​ 0.93 శాతం, యాక్సిస్​ బ్యాంక్ 0.36 శాతం, ఎన్​టీపీసీ 0.29 శాతం, పవర్​ గ్రిడ్​ 0.11 శాతం నష్టాలన  నమోదు చేశాయి.

బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 25 కంపెనీలు లాభాలను గడించాయి. 5 కంపెనీలు మాత్రమే స్వల్పంగా నష్టపోయాయి.

Also read: Viral Video: RRR 'నాటు నాటు' పాటకు బామ్మ డ్యాన్స్.. ఎనర్జీకి ఫిదా అవుటున్న నెటిజన్లు

Also read: Jacqueline Fernandez Gallery: లంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బికినీ ఫొటోషూట్ వైరల్..

ఆసియాలో ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. షాంఘై (చైనా) టోక్యో (జపాన్​), హాంకాంగ్, సియోల్​ (దక్షిణ కొరియా), థైవాన్​ సూచీలు లాభాలతో ముగిశాయి.

కాస్త పెరిగిన రూపాయి..

డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 07 పైసలు తగ్గింది. ప్రస్తుతం మారకం విలువ 74.43 వద్ద కొనసాగుతోంది.

Also read: Venkatesh Drishyam 2: వెంకటేష్ ‘దృశ్యం 2’ టీజర్ రిలీజ్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Also read: Bengaluru Express: రైలుపై విరిగిపడిన కొండచరియలు...పట్టాలు తప్పిన బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News