Flipkart Offers: రేపే ఆఫర్ ముగింపు.. రూ.20 వేలు విలువ చేసే స్మార్ట్ టీవీ కేవలం రూ.3999కే..

Flipkart Smart TV offers: పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ టీవీలపై 'ఎలక్ట్రానిక్ సేల్‌'లో ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్స్ అందిస్తోంది. డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లతో అతి చౌక ధరకే స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయవచ్చు.   

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 17, 2022, 03:47 PM IST
  • ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు
  • స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు అందిస్తోన్న ఫ్లిప్‌కార్ట్
  • రూ.20 వేలు విలువ చేసే ఎంఐ స్మార్ట్ టీవీపై ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో భారీ తగ్గింపు
Flipkart Offers: రేపే ఆఫర్ ముగింపు.. రూ.20 వేలు విలువ చేసే స్మార్ట్ టీవీ కేవలం రూ.3999కే..

Flipkart Smart TV offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ 'ఎలక్ట్రానిక్ సేల్' పేరిట కస్టమర్స్‌కు బోలెడు ఆఫర్స్ అందిస్తోంది.ఈ సేల్ ద్వారా రూ.99 విలువ చేసే వస్తువులు మొదలు రూ.1 లక్ష విలువ చేసే లగ్జరీ వస్తువుల వరకు చౌక ధరకే కొనుగోలు చేయవచ్చు. పిల్లల టాయ్స్, దుస్తులు, వాచీలు, కిచెన్ వస్తువులు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు తదితర వస్తువులపై ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. పలు బ్రాండ్ స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది.  ఎంఐ 4ఏ పీఆర్‌వో 80 సెం.మీ (32 అంగుళాలు) స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఆఫర్‌తో డెడ్ చీప్‌ ధరకే ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో 25 శాతం డిస్కౌంట్ :

ఎంఐ 4ఏ పీఆర్‌వో 80 సెం.మీ (32 అంగుళాలు) స్మార్ట్ టీవీ లాంచింగ్ ధర రూ.19,999.  ఫ్లిప్‌కార్ట్‌‌లో దీనిపై 25 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. డిస్కౌంట్ పోగా ఈ టీవీని రూ.14,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ కొనుగోలుకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడినట్లయితే.. మరో రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. అప్పుడు మరింత చౌకగా రూ.13,999కే ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో డెడ్ చీప్‌గా.. :

ఎంఐ 4ఏ పీఆర్‌వో 80 సెం.మీ (32 అంగుళాలు) స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత టీవీని ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్లయితే.. దాని కండిషన్‌ని బట్టి గరిష్ఠంగా రూ. 11వేల వరకు తగ్గింపు లభిస్తుంది. తద్వారా రూ.14,999 విలువ చేసే టీవీని కేవలం రూ.3,999కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ఎలక్ట్రానిక్ సేల్ జూలై 14 నుంచి జూలై 18 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. చౌక ధరలో ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలంటే ఈలోపే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. 

Also Read: India vs England: మూడో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..తుది జట్టు ఇదే..!

Also Read: Cloud Busrt: క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటీ? ఆకస్మిక వరదలు స్పష్టించడం సాధ్యమా? గోదావరిపై కుట్ర జరిగిందా?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News