Stock Market today: రిలయన్స్ షేర్ల అండతో స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు!

Stock Market News: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలను గడించాయి. సెన్సెక్స్ 454 పాయింట్లు, నిఫ్టీ 121 పాయింట్లు పుంజుకున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2021, 04:06 PM IST
  • లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • నష్టాల నుంచి తేరుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్​
  • కలిసొచ్చిన ఐటీ షేర్ల సానుకూలతలు
Stock Market today: రిలయన్స్ షేర్ల అండతో స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు!

Stock Market Update: స్టాక్ మార్కెట్లు ఒక రోజు నష్టం తర్వాత తిరిగి (Stocks closing bell) గురువారం లాభాలతో ముగిశాయి.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ (BSE Sensex) భారీగా 454 పాయింట్లు పెరిగి 58,795 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజి నిఫ్టీ (NSE Nify) 121 పాయింట్ల లాభంతో 17,536 వద్ద స్థిరపడింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ షేర్లు ఒడుదొడుకుల నుంచి తేరుకోవడం, ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో సానుకూలతలు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Also read: Gautam Adani: ముకేశ్ అంబానీని దాటేసి.. ఆసియాలో అపర కుబేరుడిగా గౌతమ్ అదానీ

Also read: వరుసగా రెండవరోజు తగ్గిన బంగారం ధర, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి ధరలు

ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..

ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 58,901 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 58,143 కనిష్ఠానికి పడిపోయింది.

నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,564 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,351 పాయింట్ల కనిష్ఠాన్ని తాకి.. చివరి తేరుకుని లాభాలతో ముగిసింది.

లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..

రిలయన్స్ ఇండస్ట్రీస్​ అత్యధికంగా 6.10 శాతం లభాపడింది. ఐటీసీ 1.49 శాతం, ఇన్ఫోసిస్​ 1.47 శాతం, టెక్ మహీంద్రా 1.32 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.14 శాతం పుంజుకున్నాయి.

మారుతీ సుజుకీ 1.23 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.22 శాతం, ఇండస్​ ఇండ్ బ్యాంక్ 1.20 శాతం, హెచ్​యూఎల్​ 1.12 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.75 శాతం నష్టపోయాయి.

బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 14 కంపెనీలు లాభాలను గడించాయి. 16 కంపెనీలు నష్టపోయాయి.

Also read: Free insurance offers: మీ వద్ద డెబిట్ కార్డ్ లేదా Credit card ఉందా ? అయితే ఫ్రీ ఇన్సూరెన్స్ ఆఫర్ ఉన్నట్టేనట!

ఆసియాలో ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. టోక్యో (జపాన్​), హాంకాంగ్, థైవాన్ సూచీలు లాభాలను గడించాయి. షాంఘై (చైనా), సియోల్​ (దక్షిణ కొరియా) సూచీలు నష్టపోయాయి.

కాస్త పెరిగిన రూపాయి..

డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 0.15 శాతం పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 74.51 వద్ద కొనసాగుతోంది.

Also read: Bank Holidays: డిసెంబర్‌లో ఏకంగా 16 రోజులు బ్యాంకులకు సెలవులు.. అవేంటో మీరే చూడండి!

Also read: Bumper Offer: రూ. 19,900 ధర గల Samsung 32-ఇంచెస్ TV.. కేవలం రూ. 5,240కే.. త్వరపడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News