F4 Update: బ్లాక్ బస్టర్ సినిమా ఫ్రాంచైజీ కి సీక్వెల్.. మళ్లీ ఆ ఇద్దరు హీరోలతోనే..

F4 Movie: ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్లు.. అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. తాజాగా ఇప్పుడు ఎఫ్ 4 తో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారట. ముందు రెండు సినిమాలలో హీరోలుగా నటించిన విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ఈ సినిమాలో కూడా హీరోలుగా.. కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 11, 2024, 10:38 PM IST
F4 Update: బ్లాక్ బస్టర్ సినిమా ఫ్రాంచైజీ కి సీక్వెల్.. మళ్లీ ఆ ఇద్దరు హీరోలతోనే..

F4 Update: ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ కూడా లేకుండా అన్ని సినిమాలతోనూ.. సూపర్ హిట్ లు అందుకున్న డైరెక్టర్ల..జాబితాలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయడంలో అనిల్ రావిపూడికి.. ఎవరు సాటి రాలేరేమో. ముఖ్యంగా అనిల్ రావిపూడి.. అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎఫ్2 ఫ్రాంచైజీ. 

ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ సీనియర్ హీరో వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ లతో అనిల్ రావిపూడి చేసిన సినిమా.. బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సీక్వల్ గా తెరకెక్కిన ఎఫ్ 3 కూడా బాక్స్ ఆఫీస్ వద్ద.. మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమాలకి.. మరొక సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు అనిల్ రావిపూడి. 

ముందు రెండు సినిమాలని.. నిర్మించిన దిల్ రాజు.. ఈ సినిమాని కూడా నిర్మించబోతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే..ఈ సినిమా వచ్చే ఏడాది నుంచి సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ఎఫ్2, ఎఫ్3 ఈ సినిమాలలో ప్రేక్షకులను అలరించిన వెంకటేష్, వరుణ్ తేజ్.. ఈ సినిమాలో కూడా హీరోలుగా కనిపించానున్నారని తెలుస్తోంది. 

తమన్నా, మెహరీన్ పిర్జాదాలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించనున్నారు. ఎఫ్2 సినిమా మొత్తం.. మొగుడు, పెళ్ళాల మధ్య జరిగే గొడవలు గురించి ఉండగా, ఎఫ్ 3 సినిమాలో డబ్బుల గురించి గొడవలు జరుగుతూ ఉంటాయి. మరి ఎఫ్ 4 సినిమా కోసం.. అనిల్ రావిపూడి ఎలాంటి కాన్సెప్ట్ రెడీ చేశారో.. తెలియాల్సి ఉంది.

రెండు సినిమాలు మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం మంచి సక్సెస్ ను అందుకున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద.. భారీ కలెక్షన్లు నమోదు చేసుకున్నాయి. సంక్రాంతి సందర్భంగానే విడుదలైన రెండు సినిమాలు విజేతలుగానే నిలిచాయి.

దీంతో ఎఫ్ 4 సినిమా మీద కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం వెంకటేష్ ఈ మధ్యనే.. సైంధవ్ శర్మతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు కానీ పెద్దగా మెప్పించలేకపోయారు. హిట్ ఫేమ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా.. వెంకీకి అనుకున్న స్థాయిలో హిట్టుపలేకపోయింది. ప్రస్తుతం వెంకటేష్.. అనిల్ రావిపూడి తోనే ఒక సినిమా చేస్తున్నాడు.

ఇక వరుణ్ తేజ్ ఈ మధ్యనే ఆపరేషన్ వాలెంటైన్.. అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. 2019 లో జరిగిన పుల్వామా ఎటాక్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఎఫ్ 4 సినిమా ఈ ఇద్దరు హీరోలకి.. కీలకంగా మారబోతోంది.

బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ కాబట్టి అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కొంచెం హిట్ టాక్ వచ్చినా.. సినిమా మంచి కలెక్షన్లను అందుకునే అవకాశం ఉంది. మరి ఈ సినిమాతోనైనా.. ఈ ఇద్దరు హీరోలు మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అందుకుంటారా.. లేదా చూడాలి.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News