Allu Arjun: అసలు పుష్ప సినిమా కథ నేషనల్ అవార్డు టీం వారికి పూర్తిగా అర్థమైందా?

Allu Arjun: ప్రముఖ స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే బన్నీకి సినిమాకి సంబంధించి నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. కానీ చూస్తూ ఉంటే నేషనల్ అవార్డు టీం వారు అసలు సినిమానే చూడలేదా అని ప్రశ్నలు మొదలవుతున్నాయి..  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2023, 12:06 PM IST
Allu Arjun: అసలు పుష్ప సినిమా కథ నేషనల్ అవార్డు టీం వారికి పూర్తిగా అర్థమైందా?

Allu Arjun: 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికీ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటన ప్రేక్షకులను వేరే రేంజ్ లో మెప్పించింది. స్మగ్లర్ పాత్రలో బన్నీ నటన, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ వంటివి అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విధంగా ఉంటాయి.

ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ నటనకి గాను నేషనల్ అవార్డు కూడా లభించింది. 69 ఏళ్లలో నేషనల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. తాజాగా బన్నీ ఈ నేషనల్ అవార్డుని అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు నేషనల్ అవార్డు టీం వారు సినిమాని పూర్తిగా చూశారా లేదా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ వారు సినిమా చూసినప్పటికీ వారికి కథ పూర్తిగా అర్థం కాలేదు అని మరి కొందరు అంటున్నారు. దానికి కారణం వారు అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పుడు చెప్పిన మాటలు. నిజానికి పుష్ప సినిమాలో ఒక మామూలు కూలీగా మొదలైన పుష్ప రాజ్ ప్రముఖ ఎర్రచందనం స్మగ్లర్ గా మారి సిండికేట్ ని ఎలా సొంతం చేసుకున్నారు అనేది పుష్ప సినిమా కథ అని అందరికీ తెలిసిందే. కానీ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇస్తూ నేషనల్ అవార్డు బృందం నుంచి ఒకరు ఒక మామూలు వ్యక్తి అవినీతితో నిండిన సిస్టం ని ఎలా ఎదిరించారు అనేది సినిమా కథ అన్నట్లు చెప్పుకొచ్చారు.

వారు చెప్పిన మాటలకి సినిమా కథకి ఏ మాత్రం సంబంధం లేదు. దీంతో అసలు నేషనల్ అవార్డు బృందం వారు సినిమాని నిజంగానే చూసి అవార్డు ఇచ్చారా అని కూడా కొందరు డౌట్లు అడుగుతున్నారు. పైగా ఒక్కసారి సినిమా చూస్తే అందులో అల్లు అర్జున్ పాత్ర, పుష్ప రాజ్ కథ అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు. మరి నేషనల్ అవార్డు వారు సినిమా నిజంగా చూశారా లేదా అని ఇప్పుడు ప్రశ్నలు మొదలయ్యాయి.

మరోవైపు అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఇది డబల్ విజయం అని ఒక కమర్షియల్ సినిమాకి అవార్డు రావడం గొప్ప విషయమని అన్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సునీల్, ఫాహాధ్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, జగదీష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద 360 కోట్ల పైగా కలెక్షన్లు అందుకుని ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెకకుతున్న పుష్ప 2 తో చిత్ర బృందం బిజీగా ఉంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది దసరా సందర్భంగా విడుదల కి సిద్ధమవుతోంది.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Poco X5 Pro PricePoco X5 Pro Price In IndiaPoco X5 5G Price In India

 

Trending News