Rashmika Mandanna: విదేశాల్లో రష్మిక క్రేజ్.. సర్ ప్రైజింగ్ వెల్కమ్ చెప్పిన జపాన్ ఫ్యాన్స్..

Rashmika Mandanna: రష్మిక మందన్న గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం మన దేశంలో అసలుసిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్ ఎవరున్నా ఉన్నారంటే అది రష్మిక మందన్న అనే చెప్పాలి. ప్రస్తుతం ఈమె క్రేజ్ నేషనల్ లెవల్ దాటి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 1, 2024, 02:04 PM IST
 Rashmika Mandanna: విదేశాల్లో రష్మిక క్రేజ్.. సర్ ప్రైజింగ్ వెల్కమ్ చెప్పిన జపాన్ ఫ్యాన్స్..

Rashmika Mandanna: రష్మిక మందన్న శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ ఇపుడు బాలీవుడ్ బాట పట్టింది. నటించిన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరోయిన్‌గా సత్తా చూపెడుతోంది. లాస్ట్ ఇయర్ మొదట్లో 'మిషన్ మజ్ను', చివర్లో 'యానిమిల్' మూవీస్‌తో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. తాజాగా ఈ భామ క్రంచిర రోల్ అనిమీ అవార్డ్స్‌లో భాగంగా  భారత్ తరపున పాల్గొనేందుకు జపాన్ దేశంలోని టోక్యో వెళ్లింది రష్మిక మందన్న.  రేపు టోక్యోలో క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ గ్రాండ్‌గా  జరగనున్నాయి. గ్లోబల్ ఈవెంట్ గా జరుగుతున్న ఈ అవార్డ్స్ కార్యక్రమంలో మనదేశం నుంచి రష్మిక రిప్రెజెంట్ చేస్తోంది. ఈ గౌరవం దక్కిన ఏకైక నటిగా రష్మిక నిలిచింది. అంతేకాదు జపాన్ దేశంలో అడుగుపెట్టిన ఆమెకు జపాన్ దేశంలో గ్రాండ్‌ వెల్కమ్ లభించింది. రష్మిక ఫోటోస్‌తో కూడిన ప్లకార్డులు చూపిస్తూ స్పెషల్‌గా వెల్కమ్ చెబుతూ తమ దేశంలోకి ఆహ్వానించారు.

దేశం కానీ దేశంలో టోక్యో నగరంలోని ఎయిర్ పోర్ట్ లో అభిమానులు ఇచ్చిన వెల్కమ్ తో ఆశ్చర్యపోవడం రష్మిక వంతైంది. ఈ సందర్భంగా సర్ ప్రైజ్ అవుతూ వారికి హాయ్ చెప్పింది. పుష్ప, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో నేషనల్ క్రష్ గా మాత్రమే కాదు గ్లోబల్ గా రష్మిక మందన్న కోట్లాది అభిమానులను సంపాదించుకుంది. జపాన్ లోనూ రష్మికకు అభిమానులున్నారు. వారు తనపై చూపిస్తున్న ప్రేమకు రష్మిక తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం రశ్మిక మందన్న "పుష్ప 2", "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాలతో పాటు ఓ హిందీ ప్రాజెక్ట్ లోనూ నటిస్తోంది.

రష్మిక మందన్న విషయానికొస్తే..హిందీ సినిమాల్లో నటించే ముందే 'టాప్ టక్కర్' ఆల్బమ్‌లో నటించి అక్కడ ప్రేక్షకులను సైతం మెప్పించింది. 2020లోనే నేషనల్ క్రష్‌గా ఎంపికైన రష్మిక..  హిందీలో గుడ్ బై, మిషన్ మజ్ను, యానిమిల్ సినిమాల్లో నటించింది. యానిమల్ మూవీ హిందీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. రష్మిక మందన్నకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 40 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

రష్మిక మందన్న కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని విరాజ్ పేటలో 1996 ఏప్రిల్ 5న జన్మించింది. అంతేకాదు అక్కడ స్థానికంగా ఉండే కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత రష్మిక ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి కామర్స్, సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. అటు ఆంగ్ల సాహిత్యం, జర్నలిజంలో కూడా బ్యాచిలర్ డిగ్రీ సంపాదించింది. రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించుకుంది.  ఈమె తల్లిదండ్రులు వాళ్ల ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటారు. ఈమెకో చిట్టి చెల్లెలు కూడా ఉంది. ఈమె వీలునపుడల్లా తన ఫ్యామిలీ మెంబర్స్‌తో గడపడానికే ప్రాధాన్యత ఇస్తుంది.

Also read: Pawan Kalyan: జగన్‌ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు.. జెండా సభలో గర్జించిన జనసేనాని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News