హిమాచల్‌ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు షురూ

Last Updated : Dec 18, 2017, 02:04 PM IST
హిమాచల్‌ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు షురూ

గుజరాత్‌తో పాటు హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్‌ కోసం ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 42 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు.  కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. కాగా ఉదయం పది గంటలకు తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే కౌంటింగ్ మొదలైన గంటా.. రెండు గంటల్లోనే ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపిందీ తెలిసిపోతుంది.కాగా హిమాచల్ ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

Trending News