Parliament Budget Sessions: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఈ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు..

Parliament Budget Sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. నేడు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసగించనున్నారు. ఈ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టబోయే పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి అస్త్ర శస్త్రాలను సిద్దం చేసుకుంటోంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 31, 2025, 12:00 AM IST
Parliament Budget Sessions: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..  ఈ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు..

Parliament Budget Sessions: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి వాడీ వేడీగా మొదలు కానున్నాయి. ముందుగా రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కేంద్ర ఆర్ధిక మంత్రి ఆర్ధిక సర్వేను ప్రవేశ పెట్టనున్నారు. ఆ తర్వాత రేపు (ఫిబ్రవరి 1) 2025-26 యేడాదికి గాను బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ సారి మిడిల్ క్లాస్ ను సంతృప్తి పరిచే పలు కీలక నిర్ణయాలను మోడీ ప్రభుత్వం తీసుకుంటుందా లేదా అనేది ఆసక్తి రేకిస్తోంది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత  జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో హార్యానా, మహారాష్ట్రల్లో గెలిచిన ఊపులో బీజేపీ ఫుల్ జోష్ లో ఉంది. మరోవైపు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కీలకమైన ఢిల్లీ అసెంబ్లీలు ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. బడ్జెట్ లో ప్రభుత్వం ప్రకటించే వాటితో ఢిల్లీ ప్రజలు ఏమైనా ప్రభావితం అవుతారా అనేది చూడాలి.

ఆ సంగతి పక్కన పెడితే.. ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును ఈ బడ్జెట్  సమావేశాల్లో మోడీ గవర్నమెంట్ పార్లమెంట్ కు తీసుకురాబోతున్నట్టు అఖిల పక్ష సమావేశంలో వెల్లడించింది. ఇప్పటికే డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు, పలు పార్టీల ఎంపీలు అటెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే బిల్లులు లిస్ట్ ను కేంద్ర సర్కార్ అఖిల పక్షానికి అందజేసింది. ఇందులో వక్ఫ్ సవరణ బిల్లు కూడా ఉంది. మొత్తంగా 62 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అందులో  16 కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించేలా కేంద్ర ప్రణాళికలు రచిస్తోంది.  

వక్ఫ్ చట్ట సవరణ కోసం కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీని బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసింది. అందులో వక్ఫ్ సవరన బిల్లును జేపీసీ ఆమోదించింది. ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఇందులో 44 మార్పులు సూచించారు. అందులో 14 సవరణకు కమిటీ ఆమోద ముద్ర వేసింది. అంతేకాదు ఈ బిల్లుకు సంబంధించిన తుది నివేదికను సిద్దం చేసి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేసారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతతో పాటు జవాబుదారి తనాన్ని తీసుకొచ్చే ఉద్దేశ్యంతో మోడీ సర్కార్ ఈ బిల్లును తీసుకొచ్చింది.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

వక్ఫ్ బిల్లుతో పాటు ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ బిల్లును ప్రవేశపెట్టనుంది.  ఈ దేశంలో వలస వచ్చే వాళ్లు.. విదేశీయులకు సంబంధించిన  అక్రమంగా వలన వచ్చిన రోహింగ్యాలు.. ఇప్పటికే మూడు స్థాయిల్లో వడపోత చేసింది. వారిని డిటెన్షన్ సెంటర్ కు తీసుకుళ్లనున్నారు. అక్రమ వలస దారులు.. NRC అమలు చేయడంతో పాటు జనగణన ప్రారంభించడంతో పాటు దేశానికి దశా, దిశను నిర్దేశించే బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. ముఖ్యంగా మన దేశంలో పౌరసత్వ నిర్ధారణకు విదేశీయుకు సంబంధించిన  ఫారెనర్స్ యాక్ట్  1946,  పాస్ పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా యాక్ట్ 1920,  రిజిస్ట్రేషన్ యాక్ట్ 1939 స్థానంలో ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టి ఆమోదించనున్నారు.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x