ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ముందెవరు ? వెనుకెవరు ?

ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ముందెవరు ? వెనుకెవరు ?

Last Updated : May 23, 2019, 12:07 PM IST
ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ముందెవరు ? వెనుకెవరు ?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శాసన సభ ఎన్నికల ఫలితాల సరళి ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తం 175 స్థానాలకుగాను ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ 150 స్థానాల్లో ముందంజలో వుండగా టీడీపీ 24 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుందనుకున్న జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో ఆధిక్యత కనబరుస్తోంది. ఇతర పార్టీలకు కానీ లేదా స్వతంత్ర అభ్యర్థులకుగానీ అసలు ఇక్కడ గెలిచే అవకాశమే లేదన్నట్టుగా ఎన్నికల ఫలితాల సరళి స్పష్టంచేస్తోంది. 

అయితే, పూర్తిస్థాయిలో ఫలితాలు వెలువడితే కానీ ఏ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కాయనే విషయంలో స్పష్టత లభించే పరిస్థతి కనిపించడం లేదు.

Trending News