KTR: 'మా ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించండి'...ప్రధాని మోదీకి కేటీఆర్ ట్వీట్..

KTR:  కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ.. తెలంగాణ మంత్రి కేటీఆర్..ప్రధాని మోదీకి ట్వీట్ చేశారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2021, 09:39 PM IST
KTR: 'మా ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించండి'...ప్రధాని మోదీకి కేటీఆర్ ట్వీట్..

KTR Tweet to PM Modi: తెలంగాణ మంత్రి కేటీఆర్(Telangana Minister KTR).. ప్రధాని మోదీ(PM Modi)కి ట్వీట్ చేశారు. కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ..ట్వీట్(KTR Tweet to PM Modi)లో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఏపీలోని పోలవరం, కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత కాళేశ్వరం ప్రాజెక్టు(kaleshwaram proejct)కూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

Also Read: Face Mask Mandatory: 'మాస్క్​ లేకుండా బయటికొస్తే రూ.1000 జరిమానా': తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలోని కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్(CM KCR) అనేకసార్లు కోరినట్లు కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈనెల 6న జరగనున్న సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులపై చర్చించేలా ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీని ఆదేశించాలని.. ప్రధాని మోదీని మంత్రి కేటీఆర్​ కోరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News