CM Kcr on PM Modi: దేశానికి బీజేపీ పీడ పోవాలి..ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ ఫైర్..!

CM Kcr on PM Modi: మోదీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. చాలా రోజుల తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం..బీజేపీ పాలనపై నిప్పులు చెరిగారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 10, 2022, 07:26 PM IST
  • మీడియా ముందుకు సీఎం కేసీఆర్
  • మోదీపై మరోసారి విసుర్లు
  • కేంద్రంలో మంచి ప్రభుత్వం రావాలన్న సీఎం
CM Kcr on PM Modi: దేశానికి బీజేపీ పీడ పోవాలి..ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ ఫైర్..!

CM Kcr on PM Modi: 8 ఏళ్ల పాలనలో దేశానికి బీజేపీ ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు సీఎం కేసీఆర్. దేశానికి ఆ పార్టీ జలగలా పట్టి పీడుస్తోందని విమర్శించారు. తన అసమర్థ పాలనను మోదీ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో టీఆర్ఎస్ అడిగిన ప్రశ్నలకు ఒక్కరూ సమాధానం చెప్పలేకపోయారని తెలిపారు. 

తన డొల్లతనాన్ని బీజేపీయే బయట పెట్టుకుందన్నారు. చేతగాని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దించుతామని స్పష్టం చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని మోదీ చెబుతున్నారని..ఈ విషయంలో ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారని చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం డబుల్ ఇంజన్ స్పీడ్‌తో వెళ్తోందన్నారు సీఎం కేసీఆర్. కేంద్రంలోనూ ఇలాంటి ప్రభుత్వం రావాలని పిలుపునిచ్చారు.

Also read:Maharashtra: శివసేన ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు..ఉద్దవ్ ఠాక్రేకు ఊరటనేనా..?

Also read:EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త..త్వరలో ఒకేసారి పెన్షన్ జమ..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News