MS Dhoni, Rohit Sharma: ధోనీ ఫ్యాన్స్ vs రోహిత్ శర్మ ఫ్యాన్స్ వార్

మహేంద్ర సింగ్ ధోని అభిమానులు, రోహిత్ శర్మ అభిమానుల ( MS Dhoni fans, Rohit Sharma fans ) మధ్య మొదలైన మాటల యుద్ధం ఘర్షణకు దారితీసింది. కటౌట్ల ఏర్పాటు విషయంలో ఎం.ఎస్. ధోనీ, రోహిత్‌ శర్మ అభిమానులు ఘర్షణపడిన ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లా కురుంద్వాడ్‌లో చోటుచేసుకుంది.

Last Updated : Aug 25, 2020, 12:55 AM IST
MS Dhoni, Rohit Sharma: ధోనీ ఫ్యాన్స్ vs రోహిత్ శర్మ ఫ్యాన్స్ వార్

ముంబై : మహేంద్ర సింగ్ ధోని అభిమానులు, రోహిత్ శర్మ అభిమానుల ( MS Dhoni fans, Rohit Sharma fans ) మధ్య మొదలైన మాటల యుద్ధం ఘర్షణకు దారితీసింది. కటౌట్ల ఏర్పాటు విషయంలో ఎం.ఎస్. ధోనీ, రోహిత్‌ శర్మ అభిమానులు ఘర్షణపడిన ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లా కురుంద్వాడ్‌లో చోటుచేసుకుంది. ధోనీ ( MS Dhoni ) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఇటీవలే ధోనీ అభిమానులు అతడి కటౌట్లు, బ్యానర్లను ఏర్పాటు చేసి ధోనికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలావుండగా ఇటీవలే రోహిత్‌ శర్మకు ( Rohit Sharma ) కేంద్రం ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన సందర్భంగా అతడి అభిమానులు కూడా రోహిత్ ఫోటోలతో కూడిన కటౌట్లను ఏర్పాటు చేశారు. Also read : Adipurush: సీత పాత్రకు హీరోయిన్ ఖరారు ?

రోహిత్‌ కటౌట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో రోహిత్‌ అభిమానుల్లో ఒకరు ధోనీ అభిమానులను దూషించడం.. దీంతో ధోనీ అభిమానులు అతడిపై దాడికి పాల్పడం వెనువెంటనే జరిగిపోయాయి. ఈ దాడిలో రోహిత్ అభిమాని తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఈ ఘర్షణ వివాదం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వీరేంద్ర సెహ్వాగ్‌ ( Virender Sehwag ) ఈ వివాదంపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఆటగాళ్లంతా స్నేహభావంతో ఉంటారని.. వారి మధ్య ఎటువంటి విభేదాలు ఉండవు కానీ అనవసరంగా వారి అభిమానులే పరస్పరం గొడవ పడుతుంటారని అభిప్రాయపడిన సేహ్వాగ్.. అభిమానులు ఇకనైనా ఘర్షణలు మానుకోవాలని హితవు పలికాడు. Also read : SSR autopsy report: సుశాంత్ పోస్టుమార్టం నివేదికపై అనేక అనుమానాలు

Trending News