ఆ వృద్ధ దంపతులు.. కోహ్లీకి వీరాభిమానులు..!

జాన్‌, క్రిసియా ఇద్దరూ దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న వృద్ధ దంపతులు. వారికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం.

Last Updated : Jan 9, 2018, 02:54 PM IST
ఆ వృద్ధ దంపతులు.. కోహ్లీకి వీరాభిమానులు..!

జాన్‌, క్రిసియా ఇద్దరూ దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న వృద్ధ దంపతులు. వారికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అంతకన్నా కోహ్లీ బ్యాటింగ్ అంటే మరీ ఇష్టం. అదే ఇష్టంతో కేవలం కోహ్లీని చూడడం కోసమే దాదాపు 8,600 మైళ్లు ప్రయాణించి కేప్‌టౌన్‌ సిటీలోని న్యూలాండ్స్‌ మైదానానికి చేరుకున్నారు. అయితే ఆ వయసులో వారు కోహ్లీ ప్రదర్శన చూడడానికి రావడం పట్ల కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆ దంపతులు మాట్లాడుతూ "ఈ ప్రాంతం అంటే మాకు చాలా ఇష్టం. ఇక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది. 2016లో దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్‌ దేశాల మధ్య మ్యాచ్‌ చూసేందుకు తొలిసారి ఇక్కడికి వచ్చాం. ఆ టెస్టు డ్రా అయ్యింది. ఈ స్టేడియంలో గడపడం అంటే మాకు ఎంతో ఇష్టం. ఈ సారి భారత్ ఆటగాళ్లు‌.. దక్షిణాఫ్రికా వచ్చి ఆడుతున్నారని తెలుసుకొని వచ్చాం. ఎందుకో తెలుసా.. విరాట్‌ కోహ్లీని ప్రత్యక్షంగా చూద్దామని" అని నవ్వుతూ చెప్పడం గమనార్హం.

Trending News