ఓవైపు శాసనమండలి రద్దు దిశగా పావులు కదుపుతోన్న వైఎస్సార్ సీపీ సర్కార్.. రాజధాని అంశాన్ని సీరియస్గా తీసుకుంది. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని, పాలన ఎక్కడినుంచైనా చేయవచ్చునని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానుల అంశాన్ని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఏపీ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు.
వీఐపీల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా దేశ వ్యాప్తంగా ఎన్ఎస్జీ భద్రతను 13మంది వీఐపీలకి ఉపసంహరించనున్నారు.
Amaravati | ప్రస్తుతం ఒక్క రాజధానికే దిక్కు లేదు కానీ, ఏపీకి మూడు రాజధానులు నిర్మిస్తానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
Dwarampudi Chandra Sekhara Reddy Sensational Comments | మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్లపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.
తరచుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలను, ఆయన పాలనను ప్రశంసించే సినీ విమర్శకుడు కత్తి మహేష్ తాజాగా రూటు మార్చారు. చంద్రబాబుకు, వైఎస్ జగన్ సర్కార్కు ఏ తేడా లేదంటూ పోస్ట్ చేశారు.
కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ భూతం మళ్లీ జడలు విప్పింది. కొలిమిగుండ్ల మండలం బెలుముగుహల వద్ద టీడీపీ నేత సుబ్బారావును ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. సుబ్బారావు ఓ హోటల్ వద్ద టీ తాగుతుండగా గమనించిన ప్రత్యర్థులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ పాలన తిరోగమనం దిశలో సాగుతోందని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ విమర్శించింది. రివర్స్ టెండర్ల పేరుతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏపీలో జన్మించడమే దురదృష్టకరమని విజయసాయి రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.