టిడిపి మహానాడు 2020 ( TDP Mahanadu 2020 ) ప్రారంభమైంది. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకంటే ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ అధినేత చంద్రబాబు, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, చిన రాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలుగుదేశం పార్టీ మహానాడు చాలా ఘనంగా జరపాలని.. ఏడాది కాలంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన గురించి మహానాడు వేదిక ద్వారా ప్రజలకు వివరించాలని చంద్రబాబు భావించారట. కానీ కొరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ లాంటి పరిణామాల కారణంగా అది బాబుకు కుదిరేలా లేదు. అందుకే తెలుగు తమ్ముళ్లు చేసేదేమిలేక వర్చువల్ మహానాడు నిర్వహించాలని ఓ నిర్ణయానికొచ్చారు.
ఎప్పుడూ అదృష్టం వెన్నంటిపెట్టుకుని ఉండే ఆ ప్రజా ప్రతినిధి ఏమయ్యారు ? మాజీ మంత్రిగానే కాకుండా... కీలక వ్యవహారాల్లో చక్రం తిప్పిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్కడున్నారు ? అవును ఇప్పుడు మంత్రి అవంతి శ్రీనివాస్ ( AP minister Avanthi Srinivas ) వేస్తున్న ప్రశ్నలివే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగా.. ఓ మంత్రిగా అవంతి శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనం కోసమేనని అనుకున్నా... వాస్తవానికి కూడా ఇప్పుడు చాలామందికి వస్తున్న సందేహాలివేని అనిపిస్తోంది. బహుశా అందుకే ఏపీ మంత్రి అవంతీ శ్రీనివాస్ సైతం ఈ వ్యాఖ్యలు చేశారేమో. ఇంతకీ ఎవరిని ఉద్దేశించి మంత్రి అవంతీ ఈ వ్యాఖ్యలు చేశారో తెలుసుకోవాలంటే.. ఇదిగో ఈ
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన కరోనా వైరస్ ( Coronavirus ) అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. ఏపీలో మద్యం ధరల పెంపుపై (Liquor price hike in AP) టీడీపీ చేస్తోన్న విమర్శలపై స్పందించే క్రమంలో పార్ధసారథి ( MLA Parthasarathy ) బుధవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై, ఆ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఏపీలో మద్యం ధరలను పెంచి ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలని చూస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ వివాదంపై ఏపీఐఐసి చైర్మన్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తనదైన శైలిలో స్పందించారు.
ఏపీలో కరోనా వైరస్ నివారణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ (AP govt) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రతీ ఇంట్లో ఒకరికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు (COVID-19 tests) నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
తాను అధికారంలోకి వస్తే.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం (English medium in govt schools) విద్యను ప్రవేశపెట్టి అక్కడి విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కునేందుకు సిద్ధం చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( CM YS Jaganmohan Reddy).. అధికారంలో వచ్చాకా ఆ హామీని నిలబెట్టుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ముగింపు వ్యవహారం అనేది ఒక విధానపరమైన నిర్ణయమని.. దానిని రాద్దాంతం చేసి రాజకీయం చేయడం తగదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఏపీ సర్కార్ తీసుకున్న విధానపరమైన నిర్ణయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడం లేదని అంబటి విస్మయం వ్యక్తంచేశారు.
ఏపీలో కరోనావైరస్ పెరగడం వెనుక ఏపీ సర్కార్ నిర్లక్ష్య వైఖరి ఉందని ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. లోకల్ ట్రాన్స్మిషన్ను నిరోధించకపోతే ఆ తర్వాత వైరస్ వ్యాప్తిని అరికట్టడం కష్టం అవుతుందని అన్నారు.
సమాజం సంక్షోభంలో ఉన్న సమయంలో విమర్శలకు, రాజకీయాలకు తావు ఉండకూడదని, అన్ని రాజకీయ పార్టీలు సమష్టిగా విపత్తును ఎదుర్కోడానికి సహకరించాలని, విపత్తులో కలసి రావడానికి తెలుగుదేశం ఎల్లప్పుడూ సిద్ధం ఉంటుందని ప్రభుత్వానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ముందు మూడు సవాళ్ళున్నాయని, ఒకటి.. కరోనా నియంత్రణ, రెండు.. ఇబ్బందుల్లో
కరోనా వైరస్ వ్యాప్తిని ప్రస్తావిస్తూ సీఎం జగన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
తాడేపల్లిలోని విడిది కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల తరవాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. కాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదని, చంద్రబాబు
కరోనా కంటే ప్రమాదకరమైనది జగరోనా వైరస్ అని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యాలని ప్రయత్నిస్తోందని, దౌర్జన్య పర్వం, అరాచక వాదంతో స్థానిక సంస్థలను వశం చేసుకోవాలని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన ఏపీ సీఎం జగన్ బాబాయ్ అయిన వై ఎస్ వివేకానంద రెడ్డి హత్యా కేసుపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వెంటనే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ హై కోర్ట్ ఆదేశించింది. కాగా వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, TDP
ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. వెంకటేశ్వరావుపై (AB Venkateshwar Rao) ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను ఖరారు చేస్తూ కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. రాజకీయ పగల దృష్ట్యానే తనను అకారణంగా సస్పెండ్ చేశారని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)ను ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వర రావుకి ఇది ఊహించని షాక్.
ఇప్పటికే రాష్ట్ర రాజధాని కార్యకలాపాలు, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాన్ని, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్ క్యాపిటల్గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వైస్సార్సీపీ నేత, ఎంఎల్ఏ ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం మాట్లాడుతూ..
ప్రజా చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యాత్రలో భాగంగా చిత్తూర్ జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
రాష్ట్రంలో మరోసారి అధికార, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కాగా, గత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో దాదాపు రూ. 9 కోట్ల వ్యయంతో ప్రజా వేదికను క్యాంప్ కార్యాలయంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదిక మరోసారి వార్తల్లోకి వచ్చింది.
రాజధాని అమరావతి రథ మహోత్సవంకు వెళ్లి వస్తుంటే కొంతమంది తనపై దాడికి పాల్పడ్డారని.. అది టీడీపి పెయిడ్ ఆర్టిస్టుల పనేనని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. జై అమరావతి.. జై చంద్రబాబు.. అంటూ తనపై దాడి చేయడమే కాకుండా తనను నోటికొచ్చినట్లుగా దూషించారని ఎంపీ సురేష్ ఆవేదన వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.