ఏపీలో కరోనా వైరస్ నివారణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ (AP govt) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రతీ ఇంట్లో ఒకరికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు (COVID-19 tests) నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
తెలంగాణలో శుక్రవారం నాడు కొత్తగా 6 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు గుర్తించిన ఆరు కేసులలో 5 జీహెచ్ఎంసీ పరిధిలోవి కాగా మరొకటి రంగారెడ్డి జిల్లా పరిధిలోనిది. రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం.. శుక్రవారం నమోదైన ఆరు కరోనా పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,044కు చేరుకుంది.
కరోనా వైరస్ వ్యాప్తించకుండా నివారించడం కోసం కేంద్రం మరోసారి లాక్డౌన్ని మే 17వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. మూడోసారి లాక్డౌన్ని పొడిగిస్తూ నేడు ఆదేశాలు జారీచేసిన కేంద్ర హోంశాఖ.. మే 17వ తేదీ వరకు అందుబాటులో ఉండే సేవల వివరాలు వెల్లడిస్తూ పలు మార్గదర్శకాలు సైతం జారీచేసింది.
మే 3తో ముగియనున్న లాక్ డౌన్ ను కేంద్రం మరో రెండు వారాలపాటు పొడిగించింది. తాజా ఆదేశాల ప్రకారం మే 17వ తేదీ వరకు భారత్ లో లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
బెంగళూరులో నిర్మాణరంగంలో కూలీ పనిచేసుకుంటున్న 28 ఏళ్ల హరిప్రసాద్.. లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో సొంతూరుకి బయల్దేరాడు. బెంగుళూరు నుంచి కాలినడకనే 150 కిమీ మేర ప్రయాణించాడు. సొంతూరికి దగ్గర్లోకి వచ్చాకా అలసిపోయి కుప్పకూలి మృతి చెందాడు.
భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 28,380కి చేరగా ఇప్పటివరకు 886 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇక ఇప్పటివరకు కోవిడ్-19 బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 5,913గా ఉంది. భారత్ లో కరోనా సోకి నయమైన వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు సైతం తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రోడ్లపైకి వచ్చే వారిని అడ్డుకోవడం కోసం.. వారిలో కరోనాపై అవగాహన కల్పించడం కోసం పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఆస్పత్రులలో పనిచేస్తోన్న వైద్య సిబ్బందిలో కొన్ని చోట్ల, కొంతమంది కరోనా బారిన పడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఢిల్లీలోని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రిలో 30 మంది సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ సోకిన నేపథ్యంలో అదే ఆస్పత్రికి చెందిన మరో 39 మంది సిబ్బందిని క్వారంటైన్కి తరలించిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రెడ్జోన్, కంటైన్మెంట్ క్లస్టర్లలో ఉన్నవారిలో ఎవరికైనా శ్వాస అందక ఇబ్బుందులు పడినా, లేదా ఫ్లూ లాంటి కరోనా లక్షణాలు కనిపించినా తక్షణమే 104కు ఫోన్ చేయాలని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.