COVID-19 tests in Telangana | హైదరాబాద్: తెలంగాణలో గురువారం కొత్తగా 352 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైన కేసులలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 302 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ జిల్లాలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Coronavirus tests in Telangana | హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ నిర్ధారణ పరీక్షల విషయంలో తెలంగాణ హై కోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు సూచనలు చేసింది. ఏరోజుకు ఆ రోజు విడుదల చేస్తోన్న హెల్త్ బులెటిన్స్లో కరోనావైరస్ వ్యాప్తి, కోవిడ్-19 పరీక్షల ఫలితాలకు సంబంధించిన కీలక సమాచారం పొందుపర్చాల్సిందిగా హైకోర్టు తెలంగాణ సర్కారుకు సూచించింది.
COVID-19 tests in Telangana | హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రుల్లో మరణించిన వారికి కూడా కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేయాలన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే.
COVID-19 cases in Telangana | హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం కొత్తగా 237 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 4,974 కి చేరింది. నేడు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ( GHMC) పరిధిలోనే 195 కేసులు ఉన్నాయి.
How to fight against COVID-19 | లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటి ( మే 16 నుంచి ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా జనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించడం జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. లాక్డౌన్ సడలింపుల ( Lockdown exemptions) అనంతరం కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏవీ జనం పాటించడం లేదని, మాస్కు ధరించడం, సోషల్ డిస్టన్సింగ్ పాటించడం వంటివి చేయకపోగా.. ఒక చోట గుంపుగా ఏర్పడటం లాంటివి చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారని జూన్ 13 నాటి హెల్త్ బులెటిన్లో సర్కార్ పేర్కొంది.
Telangana COVID-19 updates | హైదరాబాద్: తెలంగాణలో బుధవారం కొత్తగా 191 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు నమోదైన వాటిలో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 143 కేసులు నమోదు కాగా.. మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 11, రంగారెడ్డి జిల్లాలో 8, మహబూబ్నగర్ జిల్లాలో 4, జగిత్యాల జిల్లాలో, మెదక్ జిల్లాల్లో 3, నాగర్ కర్నూలు, కరీంనగర్ జిల్లాల్లో 2, నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
Coronavirus tests | హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ( Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. కరోనావైరస్పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తూ కోవిడ్-19పై యుద్ధం చేస్తోన్న జర్నలిస్టులకు సరైన భద్రత లేకుండాపోయిందని రేవంత్ రెడ్డి తన బహిరంగ లేఖలో (Open letter) పేర్కొన్నారు.
COVID-19 updates | హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం నాడు కొత్తగా 178 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 143 జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే ఉన్నాయి. మిగతా కేసుల్లో రంగారెడ్డి జిల్లాలో 15 కేసులు, మేడ్చల్ జిల్లాలో 10 కేసులు, మహబూబ్నగర్లో జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 2, మెదక్ జిల్లాలో 2, జగిత్యాల, ఆసిఫాబాద్, సిరిసిల్ల, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
AP COVID-19 Updates: అమరావతి : ఏపీలో కరోనావైరస్ కోరలు చాస్తోంది. కరోనా సోకిన వారిని గుర్తించేందుకు ఓవైపు భారీ సంఖ్యలో కోవిడ్-19 టెస్టులు (COVID-19 tests) చేస్తూనే ఉన్నారు. మరోవైపు కరోనా నివారణ కోసం భారీ ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట మాత్రం పడటం లేదు
COVID-19 in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గురువారం 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆ మరునాడైన శుక్రవారం ఆ సంఖ్య మరింత పెరిగి 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 143 కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 cases) నమోదయ్యియి
COVID-19 in Telangana తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి వణికిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపాలిటీ పరిధిలో కరోనా విజృంభిస్తోంది. గురువారం నాడు రాష్ట్రంలో 127 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్థారణ కాగా అందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 110 మంది ఉన్నారు.
55 Types of Coronaviruses | హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది అని తెలిసినప్పటి నుంచే అందరికీ గుండెల్లో ఒక రకమైన గుబులు మొదలైంది. కానీ ఆ కరోనావైరస్లోనూ మళ్లీ 198 రకాల వైరస్లు ఉన్నాయని తెలిస్తే.. అప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పండి. అవును.. మీరు చదువుతోంది నిజమే.. దేశంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 198 రకాల కరోనావైరస్లు ( 198 Types of Coronaviruses) ఉన్నాయట.
COVID-19 treatment కోవిడ్-19 చికిత్స అందిస్తున్న అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పైప్ లైన్లు అందుబాటులో ఉండేలా చూడాలని.. సిబ్బంది ఎవ్వరూ సెలవుల్లో వెళ్లకుండా పూర్తిస్థాయిలో హాజరయ్యేలా చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ( Health minister Etela Rajender ) అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇదివరకు తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసుల సంఖ్యలో తాజాగా స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. తెలంగాణలో నేడు కొత్తగా మరో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో సోమవారం కొత్తగా మరో 3 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనివేనని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1085కు చేరింది.
ఒకే బిల్డింగ్లో నివాసం ఉంటున్న వారిలో 41 మందికి కరోనావైరస్ సోకిన ఘటన ఢిల్లీలోని కపాషేరా ప్రాంతం టెకె వాలి గల్లీలో కలకలం సృష్టించింది. ఏప్రిల్ 18వ తేదీనే ఇదే బిల్డింగ్కి చెందిన ఓ వ్యక్తికి కరోనావైరస్ సోకినట్టు గుర్తించారు.
తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా రోజూవారీగా నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్కే పరిమితమవడం చూసి మురిసిపోయిన తెలంగాణ వాసులకు శనివారం కరోనా మరోసారి షాక్ ఇచ్చింది. నేడు రాష్ట్రంగా కొత్తగా 17 మందికి కరోనావైరస్ సోకినట్టు తేలింది.
కరోనావైరస్ మహమ్మారి బారిన పడకుండా జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. సమాజహితం ఏదైనా చేయాలంటే ముందుగా ప్రాణాలతో ఉండాలని సూచిస్తూ.. పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అంటే ముందుగా గుర్తుకొచ్చేది నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో గుంపులు గుంపులుగా తరలివచ్చి శ్రీవారిని దర్శించుకోవడమే. కానీ ఇకపై అలాంటివి కుదరదని టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి (SV SubbaReddy) తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.