COVID-19 updates:హైదరాబాద్ : తెలంగాణలో గురువారం రాత్రి నాటికి గత 24 గంటల్లో 14,027 మందికి కొవిడ్-19 పరీక్షలు చేయగా.. 1,676 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 2,22,693 మందికి కరోనా పరీక్షలు ( COVID-19 tests in Telangana ) నిర్వహించారు.
హైదరాబాద్ : తెలంగాణలో మంగళవారం రాత్రి వరకు గత 24 గంటల్లో 13,175 మందికి కొవిడ్-19 పరీక్షలు ( COVID-19 tests ) చేయగా.. 1,524 మందికి కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్టుగా గుర్తించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఒక్క జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 815 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ (coronavirus) పరీక్షలు చేయకపోవడంపై తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) విస్మయం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న కరోనా పరీక్షలు, బాధితులకు అందుతున్న చికిత్సపై మంగళవారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
COVID-19 cases:హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు మొత్తం 11,062 కరోనా పరీక్షలు ( Coronavirus tests ) చేయగా.. 1,178 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 33,402 కి చేరుకుంది.
Coronavirus in AP: అమరావతి: ఏపీలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం 20,590 శాంపిల్స్ పరీక్షించగా.. 1,775 మందికి కరోనావైరస్ ( COVID-19 ) సోకినట్టు తేలింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో మొత్తం 17 మంది కరోనాతో చనిపోయారు.
COVID-19 cases: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 1,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. నేడు నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 762 కేసులు నమోదయ్యాయి. తాజాగా విడుదలైన కోవిడ్-19 హెల్త్ బులెటిన్ ( COVID-19 health bulletin ) ప్రకారం కరోనావైరస్ కారణంగా ఇవాళ ఎనిమిది మంది మృతి చెందారు.
COVID-19 cases: హైదరాబాద్: తెలంగాణలో గురువారం కొత్తగా 1,410 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎప్పటిలాగే అందులోనూ జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే మొత్తం 918 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ హెల్త్ బులెటిన్ ( Health bulletin ) విడుదల చేసింది.
GHMC Corona Rapid Tests | తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయిని రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టులపై తమ వ్యూహాన్ని మార్చింది. అత్యధికంగా కేసులు నమోదవుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా ర్యాపిడ్ టెస్టులు ప్రారంభించింది. దీని ద్వారా కేవలం 30 నిమిషాల్లో కరోనా టెస్టుల ఫలితం రానుంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ (Coronavirus) రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. ఎప్పటిలాగానే హైదరాబాద్ నుంచే అత్యధిక కేసులు బయటపడటంతో ప్రజల భయాందోళన మరింత పెరిగింది.
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాలనుంచే కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
తెలంగాణలో వరుసగా మూడోరోజు భారీగా కరోనా కేసులు (Telangana COVID19 Cases) నమోదయ్యాయి. అయితే గత రెండు రోజులతో పోల్చితే నేడు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే తాజాగా మరో ఏడుగురు వ్యక్తులు కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జూలై 3, శుక్రవారం రోజున ఒక్క రోజే రికార్డు స్థాయిలో 1,892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే అత్యధికంగా 1,658 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Hyderabad Man Commits Suicide | ఇద్దరు అక్కలను దారుణంగా హత్యచేసి, మరో సోదరి, బావలపై కూడా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన నిందితుడు ఇస్మాయిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల తర్వాత కుళ్లిపోయిన స్థితి డెడ్ బాడీని అతడి ఇంట్లోనే గుర్తించారు.
A Psycho killed siblings in Hyderabad | అమ్మకు బాగోలేదంటూ తోబుట్టువులను ఇంటికి రప్పించాడు. ప్లాన్ ప్రకారం వారిపై కత్తితో దాడి చేసి దురాగతానికి పాల్పడ్డాడు ఆ నిందితుడు. ఇంటికి రాని మరో అక్క ఇంటికి వెళ్లి ఆమెపైనా, అడ్డువచ్చిన బావపైన కత్తితో దాడి చేశాడు. మరో అక్కను చంపేసేందుకు కత్తితో వెళ్లాడు. పోలీసులను చూసి పరారయ్యాడు.
LockDown In Hyderabad | కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రవేశపెట్టిన లాక్డౌన్(lockdown) నిబంధనలు సడలించినప్పటి నుంచి హైదరాబాద్ (Hyderabad) నగరంలో, జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది.
Telangana COVID19 Cases | కరోనా వైరస్ టెస్టులు తక్కువగా చేస్తున్నప్పటికీ తెలంగాణలో కుప్పలు తెప్పలుగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో 983 కరోనా కేసులు నమోదైనట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
Coronavirus tests in Telangana | హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ నిర్ధారణ పరీక్షల విషయంలో తెలంగాణ హై కోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు సూచనలు చేసింది. ఏరోజుకు ఆ రోజు విడుదల చేస్తోన్న హెల్త్ బులెటిన్స్లో కరోనావైరస్ వ్యాప్తి, కోవిడ్-19 పరీక్షల ఫలితాలకు సంబంధించిన కీలక సమాచారం పొందుపర్చాల్సిందిగా హైకోర్టు తెలంగాణ సర్కారుకు సూచించింది.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న జీహెచ్ఎంసీ, పరిసర ప్రాంతాల జిల్లాల్లో 50వేల వరకు ఉచిత కరోనా పరీక్షలను తెలంగాణ సర్కార్ ప్రారంభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.