Disha:'దిశ' తరహాలో మరో అత్యాచారం

తెలంగాణలో మరో మహిళపై అఘాయిత్యం. దిశ ఘటన మరువక ముందే మరో మహిళపై అత్యాచారం..!! పోలీసులు ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నా. . ఎన్ని కొత్త చట్టాలు చేసినా. .  అత్యాచారాలపర్వం ఆగడం లేదు. దిశ తరహాలోనే మరో మహిళపై అత్యాచారం, హత్య చేయడం ఇప్పుడు మళ్లీ కలవరపెడుతోంది.

Last Updated : Mar 18, 2020, 09:25 AM IST
Disha:'దిశ' తరహాలో మరో అత్యాచారం

'దిశ' తరహాలో మరో అత్యాచారం
తెలంగాణలో మరో ఘటన 
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనం 

తెలంగాణలో మరో అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. దిశ తరహాలోనే మరో మహిళ.. కామాంధుల పైశాచికత్వానికి బలైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం తంగడపల్లిలో వెలుగు చూసింది.

Read Also: అన్ని హ్యాండ్ శానిటైజర్‌లు ఒకేలా ఉండవు..!!

దిశ తరహాలోనే అత్యాచారం చేసి .. మహిళను హత్య చేశారు కామాంధులు. ఇప్పుడు ఈ ఘటన మరోసారి తెలంగాణలో కలకలం రేపుతోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మహిళ ఆనవాళ్లు ఇప్పటి వరకు తెలియని పోలీసులు చెబుతున్నారు. మహిళ ఒంటిపై దుస్తులు కూడా లేవంటున్నారు పోలీసులు. ఆధారాల కోసం సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

Read Also:  'కరోనా వైరస్'కు వ్యాక్సిన్.. వచ్చేస్తోంది..!!

ఎక్కడో అత్యాచారం, హత్య చేసి ఇక్కడకు తీసుకొచ్చి పడేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.

Trending News