Telangana: తాజాగా 2,154 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్త.. మళ్లీ రెండువేలకుపైగా నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య నిన్ననే 2లక్షలు దాటిన సంగతి తెలిసిందే.

Last Updated : Oct 7, 2020, 10:26 AM IST
Telangana: తాజాగా 2,154 కరోనా కేసులు

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్త.. మళ్లీ రెండువేలకుపైగా నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య నిన్ననే 2లక్షలు దాటిన సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో మంగళవారం ( అక్టోబరు 6 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 2,154 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 8 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,04,748 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,189 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: WHO: ఈ ఏడాది చివరి నాటికి.. కోవిడ్ వ్యాక్సిన్!

అయితే ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 1,77,008 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 26,551 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 86.45 శాతం ఉండగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. Also read: WHO: పది మందిలో ఒకరికి కరోనా.. రాబోయేది మరింత కష్టకాలం!

ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం 54,277 కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో అక్టోబరు 6 వరకు రాష్ట్రంలో 33,46,472 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. అయితే రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 303, రంగారెడ్డి జిల్లాలో 205, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 187 కేసులు చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

telangana corona cases bulletin

Bharat Biotech: కోవాగ్జిన్ రెండో దశ క్లినికల్ టెస్టులు ప్రారంభం

Trending News