తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందన్న కేంద్రమంత్రి

 కేంద్రమంత్రి రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు 

Last Updated : Sep 4, 2018, 06:25 PM IST
తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందన్న కేంద్రమంత్రి

తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశంపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే స్పందిస్తూ వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తరపున ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని చెబుతూ కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కామారెడ్డిలో పర్యటించిన సందర్భంగా అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, కేంద్రంలో కానీ లేదా తెలంగాణలో కానీ బీజేపీతో అధికారికంగా ఎటువంటి పొత్తు పెట్టుకోని టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓ కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది. 

ఇదిలావుంటే, మరోవైపు తెలంగాణలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనుందని తరచుగా చెబుతూ వస్తోన్న తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు.. ఏ మాత్రం వీలు చిక్కినా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి వెనుకాడటం లేదు. ఇటువంటి తరుణంలో కేంద్రమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ఒకింత గందరగోళానికి దారితీశాయి. 

Trending News