హైకోర్టు మెట్లెక్కిన తీన్మార్ మల్లన్న

హైకోర్టు మెట్లెక్కిన తీన్మార్ మల్లన్న

Last Updated : Oct 9, 2019, 06:10 PM IST
హైకోర్టు మెట్లెక్కిన తీన్మార్ మల్లన్న

హుజూర్‌నగర్‌: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న తనకు పోలీసులు ఆటంకం కలిగిస్తున్నారని.. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులను వారించాల్సిందిగా కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారానికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా పోలీసులకు ఆదేశాలు జారీచేయాల్సిందిగా ఆయన హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. 

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి, టీఆర్ఎస్ తరపున శానంపూడి సైది రెడ్డి, బీజేపి తరపున కోట రామా రావు, టీడీపి తరపున చావా కిరణ్మయి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.

Trending News