అమరజవాన్ల కుటుంబాలకు భారీ విరాళం ప్రకటించిన సీఎం కేసీఆర్

అమరజవాన్ల కుటుంబాలకు భారీ విరాళం ప్రకటించిన సీఎం కేసీఆర్ 

Last Updated : Feb 22, 2019, 12:33 PM IST
అమరజవాన్ల కుటుంబాలకు భారీ విరాళం ప్రకటించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: పుల్వామా దాడిలో ఉగ్రవాదుల ఘాతుకానికి బలైన అమరజవాన్ల కుటుంబాలకు తెలంగాణ సీఎం భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ సర్కార్ తరపున అమరజవాన్లకు చెందిన ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల మేర ఆర్థిక సహాయం అందించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పుల్వామా దాడిలో అసువులుబాసిన వీరజవాన్లకు సభ్యులు సంతాపం ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రకటన చేశారు.

Trending News