చంద్రబాబు నాయుడుతో సమావేశమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి

చంద్రబాబు నాయుడుతో సమావేశమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి

Last Updated : Oct 28, 2018, 02:25 PM IST
చంద్రబాబు నాయుడుతో సమావేశమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన మహాకూటమి నేతలు అందుకు అవసరమైన ఏర్పాట్లలో తలమునకలయ్యారు. అందులో భాగంగానే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీలో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఏపీ భవన్‌లో జరిగిన ఈ కీలక భేటీలో తెలంగాణలో మహా కూటమిలో సీట్ల పంపకాలు, ఎన్నికల ప్రచారం వ్యూహాలు, ప్రణాళికలు వంటి అంశాలు ఈ భేటిలో చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతోపాటు ఈ సమావేశంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ కూడా పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌ రూపొందించిన ఎన్నికల ప్రణాళికతో ఇవాళ ఢిల్లీకి చేరుకున్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. ఆ ఎన్నికల ప్రణాళికను రేపు పార్టీ అధిష్ఠానానికి అందచేయనున్న నేపథ్యంలోనే అంతకన్నా ముందుగా ఓసారి మహా కూటమి భాగస్వామి అయిన టీడీపీ అధినేతతో ఈ భేటీలో పాల్గొన్నట్టు సమాచారం. 

Trending News