Telangana Corona Cases: తెలంగాణలో కరోనా కల్లోలం, తాజాగా 2 వేలు పైగా పాజిటివ్ కేసులు

Telangana Corona Cases: ఏప్రిల్ నెలలో దేశంలో కరోనా మహమ్మారి పలు రాష్ట్రాలలో కలకలం రేపుతోంది.  తెలంగాణలో కరోనా కేసులు 2000కు పైగా నమోదయ్యాయి. రాష్ట్రంలో తాజాగా 2,055 మంది కరోనా బారిన పడ్డారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 8, 2021, 10:45 AM IST
Telangana Corona Cases: తెలంగాణలో కరోనా కల్లోలం, తాజాగా 2 వేలు పైగా పాజిటివ్ కేసులు

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ రెండో దశలో తీవ్రరూపం దాల్చుతోంది. ఏప్రిల్ నెలలో దేశంలో కరోనా మహమ్మారి పలు రాష్ట్రాలలో కలకలం రేపుతోంది.  తెలంగాణలో కరోనా కేసులు 2000కు పైగా నమోదయ్యాయి. రాష్ట్రంలో తాజాగా 2,055 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,18,704కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ గురువారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

తెలంగాణలో బుధవారం రాత్రి 8 గంటల వరకు గత 24 గంటల్లో 87,332 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో రెండు వేల యాభై అయిదు మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 18 వేల 7 వందల నాలుగుకి చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ నిన్న మరో ఏడుగురు వ్యక్తులు చనిపోయారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణ(Telangana)లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,741కి చేరింది.

Also Read: Gold Price Today 08 April 2021: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు, వెండి ధరలు పైపైకి

దేశంలో ఎన్నడూ లేని విధంగా ఈ వారం మూడోసారి లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు కోలుకున్న వారి సంఖ్య కన్నా నాలుగైదు రెట్లు అధికంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లోనూ కరోనా భయాందోళన పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజు రాష్ట్రంలో చికిత్స అనంతరం కోవిడ్-19(COVID-19) నుంచి 303 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,03,601 మంది కరోనా మహమ్మారిని జయించారు. 

Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 08, 2021, ఓ రాశివారికి ధనలాభం

తాజా కోవిడ్-19 పాజిటివ్ కేసులలో అధికంగా జీహెచ్ఎంసీలోనే నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోనే ఏకంగా భారీగా కరోనా కేసులు నమోదు కావడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో మాస్కులు లేకపోతే రూ.1000 జరిమానా విధిస్తూ కోవిడ్-19 నిబంధనలు కఠినతరం చేసినా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 13,362 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 8,263 మంది చికిత్స పొందుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News