COVID-19 Cases: తెలంగాణలో సగానికి తగ్గించిన కరోనా నిర్ధారణ పరీక్షలు, తాజాగా 49 మంది మృతి

Telangana COVID-19 Positive Cases : కరోనా టీకా మోతాదులు రానందున 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ జరగడం లేదు. రాష్ట్రంలో తాజాగా 5,695 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

Written by - Shankar Dukanam | Last Updated : May 3, 2021, 10:43 AM IST
  • తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం
  • తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 5,695 మంది కరోనా బారిన పడ్డారు
  • మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,56,485కి చేరింది
COVID-19 Cases: తెలంగాణలో సగానికి తగ్గించిన కరోనా నిర్ధారణ పరీక్షలు, తాజాగా 49 మంది మృతి

Telangana COVID-19 Positive Cases: తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ ప్రభావం అధికంగా ఉంది. కరోనా టీకా మోతాదులు రానందున 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ జరగడం లేదు. రాష్ట్రంలో తాజాగా 5,695 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,56,485కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 వరకు గడిచిన 24 గంటల్లో 58,742 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 5 వేల 6 వందల 95 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల 56 వేల 4 వందల 85కు చేరింది. కరోనా వైరస్(CoronaVirus) బారిన పడి రాష్ట్రంలో మరో 49 మంది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాలు 2,417కి చేరింది. 

Also Read: Risk Factors For Covid-19: కరోనా వీరికి సోకితే మరింత ప్రమాదకరం.. ప్రాణాలు కూడా పోతాయి

తాజా కేసులలో GHMC పరిధిలోనే 1,352 కరోనా కేసులు నమోదయ్యాయి. నిత్యం జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు నిర్దారణ అవుతున్నాయి.  తాజా కేసులతో కలిపితే తెలంగాణలో ప్రస్తుతం 80 వేల 135 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 1.31 కోట్ల శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు చికిత్స అనంతరం కోవిడ్-19(COVID-19) బారి నుంచి 6,206 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,73,933 మంది కరోనా మహమ్మారిని జయించారు. రాష్ట్రంలో కరోనా బారి నుంచి కోలుకుంటున్న వారు 81.91 శాతం ఉన్నారు. 

Also Read: Covid-19 Vaccination: కరోనా వ్యాక్సిన్‌పై మరో ఆసక్తికర విషయం వెల్లడించిన నిపుణులు

తెలంగాణలో ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాల ప్రక్రియ కొనసాగుతోంది. యువతీయువకులకు ఇచ్చేందుకు టీకాలు లేని పరిస్థితి పలు జిల్లాల్లో కనిపిస్తోంది. కానీ కరోనా టీకాల వివరాలు తెలుసుకునేందుకు టీకా కేంద్రాలకు యువతీయువకులు తరలి వస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ అదనంగా ఆరోగ్యశాఖ తీసుకున్న అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టులు తగ్గించడంతో పాజిటివ్ కేసులు తగ్గినట్లు తెలుస్తోంది. కోవిడ్19 నిబంధనలు పాటించడం, కరోనా టీకాలు తీసుకోవడం మాత్రమే మహమ్మారిని ఎదుర్కొనేందుకు మార్గాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: Cancer Patients: క్యాన్సర్ బాధితులకు COVID-19 సోకితే మరింత ప్రమాదకరం, ఈ విషయాలు తెలుసుకోండి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News