కరోనా కల్లోలం.. ఏపీలో 2 వేలు దాటిన పాజిటివ్ కేసులు

7,409 సాంపిల్స్ ని పరీక్షించగా 38 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారించారు. 73 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్ఛార్జ్ అయ్యారు.

Last Updated : May 11, 2020, 01:46 PM IST
కరోనా కల్లోలం.. ఏపీలో 2 వేలు దాటిన పాజిటివ్ కేసులు

AP COVID19 Updates |  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 2 వేలు దాటిపోయాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2018కి చేరాయి. తాజాగా 7,409 శాంపిల్స్ పరీక్షించగా అందులో 38 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది.  నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు

Image Credit: twitter/@ArogyaAndhra

ఏపీలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం 2018 కేసులకుగానూ తాజాగా 73 మంది కోవిడ్ బారి నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ చికిత్స అనంతరం ప్రాణాంతక వైరస్ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 998కు చేరింది. ప్రస్తుతం 975 మంది ప్రాణాంతక వైరస్‌కు చికిత్స పొందుతుండగా, మొత్తం 45 మంది మరణించారు.  Mothers Day: దిల్ రాజుకు రెండో పెళ్లి చేసిన కూతురు

  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News