YS Jagan Mohan Reddy: ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి.. తక్షణమే జోక్యం చేసుకోండి.. ప్రధానికి జగన్ లేఖ..

YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ లో  తెలుగు దేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో  శాంతి భద్రతలు క్షీణించాయని..తక్షణమే కేంద్ర ప్రభుత్వం  జోక్యం చేసుకోవాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సుధీర్ఘ లేఖ రాసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 19, 2024, 07:35 AM IST
YS Jagan Mohan Reddy: ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి.. తక్షణమే జోక్యం చేసుకోండి.. ప్రధానికి జగన్ లేఖ..

YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఏపీ తాజాగా మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సుధీర్ఘ లేఖ రాయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో  నెలకొన్న అత్యంత దారుణమైన పరిస్థితులను, క్షీణించిన శాంతి భద్రతల అంశాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నానన్నట్టు తన లేఖలో పేర్కొన్నారు.

ఏపీలో  శాంతి భద్రతలు పూర్తిగా క్షీణదశకు చేరకున్నాయి. రాజ్యాంగ వ్యవస్థలు పూర్తి కూప్పకూలిపోలినట్టు తన లేఖలో పేర్కొన్నారు. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం యంత్రాంగం స్థబ్దుగా మారిపోయిందన్నారు.  ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.  అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి కార్యకర్తలు వైసీపీ సహా సామాన్య ప్రజలపై స్వైరవిహారం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. అత్యంత అనాగరిక సంఘటనలు జరుగుతున్న పోలీసలు అసలు పట్టించుకోవడం లేదన్నారు.  అమానవీయ, అమానుష ఘటనలు అడుగడున చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. .

ఏపీ అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీ కూటమి, ఆ వెంటనే.. ఈ ఎన్నికల్లో తమను సమర్థించని, తమకు ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం ప్రారంభించింన్నారు.  ముఖ్యంగా మా పార్టీ.. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను వేధించడమే పనిగా పెట్టుకున్నట్టు తెలిపారు.  వారిని కొట్టడం, చంపడం, దారుణంగా వేధించి భయానక పరిస్థితులు సృష్టించడం వంటివన్నీ చేస్తున్నారు. ఇందులో భాగంగా  మా కార్యకర్తల ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారన్నారు.  ఇళ్లు, భవనాలు కూల్చేస్తున్నారు. వ్యాపార సంస్థలపైనా దాడులు  సర్వసాధారమైపోయాయన్నారు.  పట్టపగలు యథేచ్ఛగా కొనసాగుతున్న ఈ ఘటనలు రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి నెలకొనేలా చేస్తున్నాయన్నారు.

చివరకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులంటూ.. రోడ్డు పక్కనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారినీ కూడా ఒదలడం లేదంటూ తన లేఖలో జగన్ పేర్కొన్నారు. చిరు వ్యాపారులపై  దాడులు చేసి, ఉపాధిని దెబ్బ కొడుతున్నట్టు పేర్కొన్నారు.

ఇలా కేవలం వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లు, ఆస్తులు, వ్యాపార సంస్థలపై మాత్రమే కాకుండా.. చివరకు ప్రభుత్వ ఆస్తులపైనా వారి దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆస్తులనూ వారు విధ్వంసం చేస్తున్నట్టు పేర్కొన్నారు. చివరకు రాష్ట్రంలో చాలా చోట్ల దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను కూడా  ధ్వంసం చేస్తున్నారు.

తాజాగా, గత బుధవారం, జూలై 17, 2024 రోజున పల్నాడు జిల్లా వినుకొండలో మా పార్టీ కార్యకర్త రషీద్‌ను దారుణంగా నడిరోడ్డుపై హత్య చేశారు. నడిరోడ్డు మీద ప్రజలందరూ తిరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దారుణ హత్య రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేసిందన్నారు. తెలుగు దేశం కూటమి గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ఇవన్ని సర్వ సాధారణమైపోయాయన్నారు.  

వైయస్సార్‌ కాంగ్రెస్‌ తరఫున పార్లమెంటుకు ఎన్నికైన ఎంపీలకు...శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.  గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్పగారిని పరామర్శించడానికి వెళ్లిన మా పార్టీకి చెందిన లోక్‌సభ పక్ష నాయకుడు, ఎంపీ మిథున్‌రెడ్డిపై తెలుగు దేశం మూకలు హత్యాయత్నానికి దిగిన ఘటనను ప్రస్తావించారు.  పోలీసులు సమక్షంలో ఈ ఘటన జరిగిన చూస్తూ ఉండిపోయినట్టు తెలిపారు.

రాష్ట్రంలో ఎక్కడా ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కనిపించడం లేదు. రాజ్యాంగం, చట్టం, పోలీసు వ్యవస్థ.. అన్నీ నిర్వీర్యమయ్యాయి.  నామమాత్రంగా మిగిలాయి. అన్నింటికీ భిన్నంగా, చట్ట విరుద్ధంగా అధికార పక్షం ఏర్పాటు చేసుకున్న తమ సొంత రాజ్యాంగ వ్యవస్థ ‘రెడ్‌ బుక్‌’ రాజ్యాంగం గత 40, 45 రోజులుగా ఇక్కడ పని చేస్తోందన్నారు.

గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో అంటే మంచి విద్య, మంచి వైద్యం, రైతుకు భరోసా, అక్కచెల్లెమ్మలకు సాధికారిత, పటిష్టమైన లా అండ్‌ ఆర్డర్‌ ఉండేవి. సుస్థిర, సమగ్రమైన అభివృద్ధి కొనసాగింది. వాటన్నింటిలో ఆనాడు ఈ రాష్ట్రం పేరు గొప్పగా చెప్పుకుంటే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని తన ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో అరాచకాలు తప్ప, పరిపాలన అనేది ఎక్కడా కనిపించడం లేదన్నారు.
 
ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల వ్యవధిలోనే 31 మంది హత్యకు గురయ్యారు. 300 మందిపై హత్యాయత్న ప్రయత్నం జరిగింది. టీడీపీ వాళ్ల వేధింపులు భరించ లేక 35 మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలను ప్రస్తావించారు. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను  ధ్వంసం చేశారు. వీళ్ల అరాచకాలు భరించలేక దాదాపు 2,700 కుటుంబాలు గ్రామాలు విడిచి వెళ్లిపోయాయన్నారు.  ఇవన్నీ కాక, 1,050కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి.

Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?

ఈ ఘటనలన్నీ అనుకోకుండానో లేక యాదృఛ్చికంగానో జరిగిన ఘటనలు కావు. ఒక పథకం ప్రకారం జరిగిన ఘటనలుగా పేర్కొన్నారు.  
ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరి ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాల్సింది పోయి వికక్ష చూపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా రాజకీయమయం చేశారు. హత్యలను, దాడులను, అకృత్యాలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు. దాదాపు 27 మంది ఐఏఎస్, 24 మంది ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా చేశారన్నారు. చంద్రబాబు లక్ష్యాలు, ఉద్దేశాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయి. తక్షణం శాంతి స్థాపన జరగాల్సిన అవసరం ఉందన్నారు.  సాధారణ పరిస్థితులు నెలకొనాల్సి ఉంది. అందుకే రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న ఘటనలన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ జరిపించాలననారు.
ఈ విషయాలన్నంటిని మిమ్మల్ని కలిసి, వ్యక్తిగతంగా నివేదించడం కోసం.. మీకు అనుకూల సమయంలో అపాయింట్‌మెంట్‌ ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నాను. వీలైనంత త్వరగా అపాయింట్‌మెంట్‌ ఇస్తే.. గత 40, 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులను వ్యక్తిగతంగా మీకు వివరిస్తానని వైయస్ జగన్మోహన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News