Revanth Reddy and Chandrababu Naidu Meeting: ముగిసిన ముఖ్యమంత్రుల సమావేశం.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..?

Revanth Reddy and Chandrababu Naidu Meeting Live Updates: తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు. లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 6, 2024, 07:54 PM IST
Revanth Reddy and Chandrababu Naidu Meeting: ముగిసిన ముఖ్యమంత్రుల సమావేశం.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..?
Live Blog

Revanth Reddy and Chandrababu Naidu Meeting Live Updates: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు ఇద్దరు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్థన్ రెడ్డి, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. చంద్రబాబు ప్రజా భవన్‌కు చేరుకోగానే.. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. రేవంత్ ఎలా ఉన్నావంటూ చంద్రబాబు పలకరించారు. ఈ సమావేశం లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.

 

6 July, 2024

  • 19:54 PM

    Revanth Reddy and Chandrababu Naidu Meeting Live News: చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిల సమావేశం ముగిసింది. విభజన సమస్యలపై రెండు కమిటీలు వేయాలని నిర్ణయించారు. మంత్రులతో ఓ కమిటీ, అధికారులతో మరో కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

  • 19:52 PM

    Revanth Reddy and Chandrababu Naidu Meeting Live News: విలీన మండలాల్లోని ఐదు గ్రామాలను తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ అంగీకరించింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయనున్నారు.

  • 19:46 PM

    Telugu States Cheif Ministers Meeting Live Updates: స్థిరాస్తులు ఏపీకి ఇచ్చేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిరాకరించారు. హైదరాబాద్‌లో ఉన్న స్థిరాస్తులు మొత్తం తెలంగాణకు చెందుతాయన్నారు.  
     

  • 19:43 PM

    Telugu States Cheif Ministers Meeting Agenda: విభజన అంశాలపై లోతుగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ బకాయిల లెక్కలను సీఎంల ముందు ఉంచారు ఇరు రాష్ట్రాల అధికారులు.

  • 19:36 PM

    Revanth Reddy and Chandrababu Naidu Meeting: కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో వాటా కావాలని తెలంగాణ అడుగుతోంది.

  • 19:18 PM

    Revanth Reddy and Chandrababu Naidu Meeting Live News: 9, 10 షెడ్యూల్‌లోని ఆస్తుల విభజన, హైదరాబాద్‌లోని భవనాల అప్పగింతపై చర్చ జరుగుతోంది.

  • 19:14 PM

    Revanth Reddy and Chandrababu Naidu Meeting Live News: టీటీడీ మెంబర్స్, ఆదాయం, ఆస్తుల్లో 42.58 శాతం వాటా అడుగుతోంది తెలంగాణ. 

  • 19:05 PM
  • 19:02 PM

    Revanth Reddy and Chandrababu Naidu Meeting Live News: కాళోజీ రాసిన నా గొడవ పుస్తకాన్ని చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బహుకరించారు.

  • 18:59 PM

    Revanth Reddy and Chandrababu Naidu Meeting Live News: ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి ఇవ్వాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. 
     

  • 18:56 PM

    Revanth Reddy and Chandrababu Naidu Meeting Live News: తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం వాడీవేడిగా సాగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చిస్తున్నారు.

Trending News