జనసేన పార్టీలో చేరిన లక్ష్మీనారాయణ

జనసేన పార్టీలో చేరిన లక్ష్మీనారాయణ

Last Updated : Sep 29, 2018, 01:15 PM IST
జనసేన పార్టీలో చేరిన లక్ష్మీనారాయణ

టీడీపీ పార్టీ  సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎం. లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరారు. జనసేన ప్రజా పోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే..! శనివారం నాడు ఎం. లక్ష్మీనారాయణ ఏలూరులో జరిగిన పార్టీ కార్యక్రమంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన్ను సాదరంగా ఆహ్వానించి.. పార్టీ కండువా కప్పారు.

పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గతంలో పోటీ చేసిన ఎం. లక్ష్మీనారాయణ ఎన్నికల్లో ఓడిపోయారు. శెట్టి బలిజ వర్గానికి చెందిన లక్ష్మీనారాయణ పార్టీలో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరిందని జనసేన పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా పెనుగొండ నుంచి తన మద్దతుదారులతో భారీ ర్యాలీగా వెళ్లిన ఎం.లక్ష్మీనారాయణ జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. అలాగే..వివిధ జిల్లాల నుండి ప్రముఖులు భారీగా తరలివచ్చి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.

Trending News