Andhra Pradesh: ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూత

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూ.. చాలామంది నాయకులను పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కరోనా బారిన పడి కన్నుమూశారు.

Last Updated : Jan 1, 2021, 02:41 PM IST
Andhra Pradesh: ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూత

YSRCP MLC Challa Ramakrishna Reddy passes away | హైదరాబాద్‌: కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూ.. చాలామంది నాయకులను పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కరోనా బారిన పడి కన్నుమూశారు. కరోనా బారిన పడి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న చల్లా రామకృష్ణా రెడ్డి (Challa Ramakrishna Reddy ) శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 

ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి గత నెల 13న కరోనా (Coronavirus) తో ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం మృతిచెందారు. Also Read: India Covid-19: గత 24గంటల్లో 20,036 కరోనా కేసులు 

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా (Kurnool) రాజకీయాల్లో చల్లా రామకృష్ణారెడ్డి ప్రముఖమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన స్వగ్రామం అవుకు మండలం ఉప్పలపాడు. చల్లా రామకృష్ణా రెడ్డి ఒకసారి పాణ్యం నుంచి, రెండుసార్లు కోవెలకుంట్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కాంగ్రెస్, టీడీపీలల్లో క్రీయాశీలకంగా పనిచేసి చివరిసారి ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ (YSRCP)లో చేరారు. ఆయన మృతిపట్ల మంత్రులు, వైఎస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: Pfizer-BioNTech వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి WHO అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News