TikTok user`s airwalker dance : టిక్ టాక్ యూజర్ డ్యాన్స్ చూసి షాక్ అయిన హృతిక్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ డ్యాన్స్ ఎంత అద్భుతంగా చేస్తాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. అతడి సినిమాలు చూసిన వారికి ఎవరికైనా ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది. అంతేకాదు.. హృతిక్ రోషన్ సినిమా విడుదలవుతుందంటే.. కేవలం అతడి డ్యాన్స్, యాక్టింగ్ చూడ్డానికి థియేటర్ల వద్ద బారులుతీరే అభిమానులు కూడా కోకొల్లలు.
PM Modi meets CM Mamata Banerjee: కోల్కతాలో ప్రధాని మోదీ, సీఎం మమతా బెనర్జీల భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం కొద్దిసేపటి క్రితమే కోల్కతా చేరుకున్నారు. మరోవైపు ఇటీవల కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC), వామపక్ష పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు కేంద్రంపై తీవ్ర నిరసనలు చేపడుతున్నాయి.
Mosque blast in Quetta : మసీదులో పేలుడు.. 15 మంది మృతి!
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలోని క్వెట్టాలో ఉన్న ఓ మసీదులో శుక్రవారం సాయంత్రం పేలుడు చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి సహా మొత్తం 15 మంది చనిపోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ప్రార్థనల సందర్భంగా పేలుడు చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్యతో పాటు క్షతగాత్రుల సంఖ్య కూడా అధికంగానే ఉంది.
Medaram Jatara bus fares : మేడారం జాతర భక్తులకు షాక్ ఇచ్చిన టిఎస్ఆర్టీసీ
మేడారం జాతరకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సు సేవలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న టిఎస్ఆర్టీసీ.. అదే సమయంలో బస్సు చార్జీలు కూడా పెంచి మేడారం భక్తులకు షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు జరగబోయే మేడరం జాతరకు వెళ్లే బస్సుల ఛార్జీలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయం తీసుకుంది.
Jaanu Teaser : జాను టీజర్ రివ్యూ... జాను, రామ్ మళ్లీ కలిశారా ?
నాలుగంటే నాలుగు డైలాగులతో ఆడియెన్స్ లెక్కలేనన్ని ఎమోషన్స్కి గురయ్యేలా మేకర్స్ ఈ టీజర్ను డిజైన్ చేసిన తీరు ఆడియెన్స్ని ఆకట్టుకుంటోంది. పీకల్లోతు ప్రేమలో పడిన తర్వాత విడిపోయిన రామ్-జాను మళ్లీ కలిశారా ? కలిస్తే ఎలా కలిశారు ? ఎక్కడ కలిశారు ? అసలు ఈ ప్రేమ కథా చిత్రంలో ఇంకెన్ని మలుపులున్నాయని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెంచేలా జాను మూవీ టీజర్ ఉంది.
సుదీప్కి సల్మాన్ ఖాన్ BMW M5 కారు గిఫ్ట్
దబాంగ్ 3 సినిమాలో విలన్ పాత్రలో నటించిన శాండల్వుడ్ స్టార్ హీరో కిచ్చ సుదీప్కి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఖరీదైన బీఎండబ్లూ ఎం5 (BMW M5 car) కారును గిఫ్ట్గా ఇచ్చాడు. తానే స్వయంగా సుదీప్ ఇంటికి వెళ్లిన సల్మాన్ ఖాన్... అక్కడ సుదీప్కి ఈ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు.
Infants deaths in Kota : 100కు చేరిన శిశు మరణాలు.. ఆ ఆస్పత్రిలో అసలేం జరుగుతోంది ?
రాజస్తాన్లోని కోటలో జెకె లోన్ ఆస్పత్రిలో గత డిసెంబర్ నుంచి మృతిచెందిన శిశువుల సంఖ్య తాజాగా 100కు చేరింది. డిసెంబర్ 30న ముగ్గురు, డిసెంబర్ 31న మరో ఐదుగురు శిశువులు మృతిచెందినట్టు ఆస్పత్రిలో చిన్నపిల్లల విభాగానికి ( Pediatric department ) అధిపతి అయిన డా అమృత్ లాల్ భైర్వ తెలిపారు. డిసెంబర్ 24 నాటికే మృతిచెందిన శిశువుల సంఖ్య 77కు చేరగా తాజాగా ఆ సంఖ్య 100కు చేరడం కలకలం రేపుతోంది. చనిపోయిన శిశువుల్లో అప్పుడే పుట్టిన వారు, రోజుల వయస్సున్న వారే అధికంగా ఉన్నారు. చనిపోయిన శిశువులు అందరూ తక్కువ బరువుతో పుట్టడంతో పాటు హైపోథెర్మియా ( Hypothermia ) అనే వ్యాధితో బాధ పడుతున్నట్టు డా అమృత్ లాల్ భైర్వ పేర్కొన్నారు.
GVL Narasimha Rao : కేరళ సీఎం పినరయి విజయన్పై చర్యలకు జీవీఎల్ డిమాండ్
కేంద్రం చేసిన చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత కూడా వ్యతిరేకించడం అంటే.. పార్లమెంట్కి ఉన్న విశేషాధికారాలను ధిక్కరించినట్టేనని జీవీఎల్ నరసింహా రావు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని వ్యతిరేకించే హక్కు ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ ఉండదని కేరళ సీఎం విజయన్కు జీవీఎల్ గుర్తుచేశారు.
కాబోయే బాలీవుడ్ జంటతో కోహ్లీ-అనుష్కల సెల్ఫీ.. వైరల్గా మారిన పిక్!
కిందటి వారమే కరీనా కపూర్, కరిష్మా కపూర్ ఇంటికి వెళ్లి సందడి చేసిన వరుణ్ ధావన్-నటాషా జోడీ తాజాగా అక్కడే ఫారిన్ హాలీడేయింగ్ ఎంజాయ్ చేస్తోన్న విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంటను కలిసి సర్ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా వరుణ్ ధావన్, నటాషాలతో కలిసి సెల్ఫీ తీసుకున్న అనుష్కా శర్మ.. హలో ఫ్రెండ్స్ అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ సెల్ఫీని షేర్ చేసుకుంది.
వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికిన విశాఖ.. పలు చోట్ల పూల వర్షం
ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానుల ప్రకటన తర్వాత తొలిసారిగా విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అక్కడ ఘన స్వాగతం లభించింది. అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని నిరసిస్తూ అమరావతిలో రైతులు, ప్రజా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తుండగా... విశాఖలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ కనిపించింది.
అరుణ్ జైట్లీ ఎంత గొప్ప సమర్ధుడో వివరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
దేశ హితాన్ని తన ప్రథమ కర్తవ్యంగా భావించి.. చివరి వరకు అదే సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి దివంగత మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. జైట్లీ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ మందిరంలో అరుణ్ జైట్లీ చిత్రపటం వద్ద నివాళులర్పించిన అనంతరం.. ‘ద రినైజెన్స్ మ్యాన్: ద మేనీ ఫాసెట్స్ ఆఫ్ అరుణ్ జైట్లీ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.