మామ, మరుదుల నుంచి లైంగిక వేధింపులు.. భర్తకు చెబితే బెదిరింపులు!!
కోడలిపై కన్నేసిన మామ... తల్లిలాంటి వదినపై అరాచకానికి పాల్పడిన మరుదులు.. ఇక్కడ ఘటనలు, నిందితులు వేరైనా.. బాధితురాలు మాత్రం ఒక్కరే. అవును మొత్తంగా ఆ కుటుంబమే ఓ మృగాళ్ల కుటుంబం అంటోంది ఓ అభాగ్యురాలు. కట్టుకున్న భర్తే కాదు... ఇంటికొచ్చిన కోడలిని కన్నకూతురిలా చూసుకోవాల్సిన మామ, వదినను తల్లిలా చూసుకోవాల్సిన మరుదులు... మొత్తంగా ఆ ఇల్లే ఓ ప్రత్యక్షనరకానికి కేరాఫ్ అడ్రస్ అంటోంది గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెంకు చెందిన ఓ అభాగ్యురాలు.
Rs 2000 notes | రూ. 2000 నోట్ల రద్దుపై స్పందించిన కేంద్రం
ఆర్బీఐ రూ.2వేల నోట్లను ప్రింట్ చేయడం ఆపేసినట్లు వెలువడిన వార్తలు అనేక సందేహాలకు తావిచ్చాయి. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఓ పిటిషన్కి ఆర్బీఐ సమాధానం ఇస్తూ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్బీఐ ఎప్పటికప్పుడు ప్రతీ ఏడాది రూ.2వేల నోట్ల ముద్రణను తగ్గిస్తూ వచ్చినట్టుగా వెల్లడైన సంగతి తెలిసిందే.
రేపటి నుంచే ఆర్టీసీ ఛార్జీల పెంపు.. పెరిగిన చార్జీల వివరాలు ఇవే
ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెంచనున్నట్టు ఇటీవలే ఏపీ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా పెంచిన ఛార్జీలు రేపటి నుంచే అమలులోకి రానున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ స్పష్టంచేసింది. ఈమేరకు సవరించిన చార్జీల వివరాలను తెలియజేస్తూ.. ఏపీఎస్ఆర్టీసీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు 'అన్లిమిటెడ్' గుడ్ న్యూస్
ఎయిర్టెల్(Airtel offers), వొడాఫోన్ ఐడియా (Vodafone idea offers) సంస్థలు తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ వినిపించాయి. ఇటీవల ఈ రెండు సంస్థలు టారిఫ్ ధరలు పెంచడంతో పాటు ఇతర నెట్వర్క్ నెంబర్లకు చేసే అపరిమిత వాయిస్ కాల్స్ (Unlimited voice calls)పై పరిమితి విధించి వినియోగదారులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తెలంగాణ సర్కార్, పోలీసుల వైఖరిపై గవర్నర్కి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, నేరాల సంఖ్య అధికమయ్యాయని ఫిర్యాదు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో జరిగే సకల నేరాలు అన్నింటికి కూడా కారణభూతమైన మద్యాన్ని కంట్రోల్ చేయకపోతే ఈ నేరాల్ని అదుపు చేయడం కూడా కష్టతరమవుతుందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఎన్కౌంటర్ ఘటనాస్థలాన్ని నిశితంగా పరిశీలించిన నిజ నిర్ధారణ కమిటి
జాతీయ మానవహక్కుల సంఘం పంపించిన నిజ నిర్ధారణ కమిటి సభ్యులు చటాన్పల్లికి చేరుకుని ఎన్కౌంటర్ జరిగిన ఘటనాస్థలిని పరిశీలించారు. తొలుత మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన నిజ నిర్ధారణ కమిటి సభ్యుల బృందం.. ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను పరిశీలించింది.
హైదరాబాద్ ఎన్కౌంటర్ నేపథ్యంలో సీజేఐ అరవింద్ బాబ్డే కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ ఎన్కౌంటర్పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ హై కోర్టులో కొత్తగా నిర్మించిన ఓ భవనం ప్రారంభోత్సవం కోసం శనివారం జోధ్పూర్కి వచ్చిన సందర్భంగా హైదరాబాద్ ఎన్కౌంటర్ ఘటనపై బాబ్డే స్పందిస్తూ ''ప్రతీకార చర్యలతో ఎప్పుడూ న్యాయం పొందకూడదు'' అని అన్నారు.
దిశ కేసులో ఎన్కౌంటర్పై సినీ ప్రముఖులు ఎవరేమన్నారంటే
దిశపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు నవీన్ కుమార్లను ఎన్కౌంటర్లో మట్టుపెట్టడంపై సాధారణ ప్రజానికంతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం హర్షం వ్యక్తంచేస్తున్నారు.
వరంగల్ యాసిడ్ దాడి కేసు నుంచి దిశ కేసు వరకు.. సేమ్ కాప్, సేమ్ స్టైల్ ఎన్కౌంటర్స్
దిశపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమెను దారుణంగా హతమార్చిన ఘటన సైబరాబాద్ పరిధిలో చోటుచేసుకున్నప్పుడే ప్రజానికానికి అప్పటి వరంగల్ యాసిడ్ దాడి కేసు గుర్తుకొచ్చింది. ఎందుకంటే అప్పుడు ఆ కేసులో దర్యాప్తు అధికారిగా వరంగల్ ఎస్పీ హోదాలో ఉన్నది మరెవరో కాదు... ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ కావడమే.
హెల్మెట్స్ ధరించి ఉల్లిగడ్డ విక్రయాలు
ఉల్లిపాయ ధరలు అందుబాటులో ఉన్నప్పుడు వాటిని కోస్తున్నప్పుడే కన్నీళ్లొచ్చేటివి... కానీ కిలో ఉల్లి ధర రూ.70-80 పైనే పలుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లి పేరెత్తితేనే కన్నీళ్లొస్తున్నాయంటున్నారు వినియోగదారులు.