ఉల్లి లోడుతో వెళ్తున్న ట్రక్కును దోచుకున్న దొంగలు
ఉల్లి ధరల పెరుగుదల కారణంగా పరిస్థితి ఎక్కడివరకు వెళ్లిందో చెప్పడానికి నిదర్శనంగా చోటుచేసుకున్న మరో చోరీ ఘటన ఇది. ఇటీవల కాలంలో ఉల్లి సరుకు చోరీకి గురైన ఘటనలు తరచుగా వెలుగుచూస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా బీహార్లోని కైమూరు జిల్లాలోనూ అటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
Palle pragathi 2nd phase dates : జనవరి 2 నుండి 12 వరకు తెలంగాణలో 2వ విడత పల్లె ప్రగతి
తెలంగాణలోని అన్ని గ్రామాల్లో నిర్వహించనున్న 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్లో 2వ విడత పల్లె ప్రగతి నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషితో కలిసి ప్రభుత్వం నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారుల బృందంతో కలిసి సమావేశం నిర్వహించిన అనంతరం, జిల్లా కలెక్టర్లతో మంత్రి ఎర్రబెల్లి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
TSRTC employees retirement age increased : టిఎస్ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్
టిఎస్ఆర్టీసీ ఉద్యోగులపై ఇటీవల పలు వరాలు గుప్పించిన తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. తాజాగా వారికి క్రిస్మస్ పర్వదినం నాడే మరో గుడ్ న్యూస్ వినిపించారు. ఆర్టీసీ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇదివరకే దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని ఉండగా తాజాగా బుధవారం నాడు సీఎం కేసీఆర్ అందుకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగ పదవీ విరమణ వయస్సు పెంపు ప్రకటన ఇక అధికారికంగా అమలులోకి వచ్చినట్టయింది.
పోలీసుల వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగిన రైతు !
యాదాద్రి భువనగిరి జిల్లాలోని నారాయణపురం మండలం అరేగుడెంలో మంగళవారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. భూమి పంచాయితీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాశయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసుల వేధింపులు భరించలేకే కాశయ్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
Chiranjeevi supports AP CM YS Jagan : జగన్కి జై కొట్టి.. పవన్ కల్యాణ్కి షాక్ ఇచ్చిన చిరంజీవి
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనకు (3 Capitals for AP) మెగాస్టార్, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి (Chiranjeevi) మద్దతు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఓవైపు తన సోదరుడైన పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ఈ మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా ఎండగడుతున్న తరుణంలో అదే మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ రూపంలో సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదనకు మద్దతు లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
డీఎస్సీలో ఉత్తీర్ణులైన 2,645 మంది అభ్యర్ధులకు టీచర్ పోస్టులు
డీఎస్సీ 2018లో (AP DSC 2018) ఉత్తీర్ణత సాధించిన 2,645 మంది అభ్యర్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ వెల్లడించింది. ఈనెల 22న జిల్లాల వారీగా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని, ఆదే రోజు నియామక పత్రాలు అందించాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి ఘన స్వాగతం
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. శీతాకాల విడిది నిమిత్తం సతీ సమేతంగా హైదరాబాద్ విచ్చేసిన రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, హోంమంత్రి మహమూద్ అలీ, శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర డీజీపి మహేందర్ రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి పుష్పగుచ్చాలతో ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు.
ఆందోళనల నేపథ్యంలో 19 మెట్రో స్టేషన్లు బంద్
పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయకూడదనే డిమాండ్తో దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు పౌర జీవనాన్ని పలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆందోళనకారులు ప్రజా ఆస్తులను ధ్వంసం చేసి, తగలబెడుతున్న వైనం ఆందోళనకు గురిచేస్తోంది.