ఈ వాట్సాప్ నెంబర్తో Coronavirus తాజా సమాచారం తెలుసుకోండి
కరోనా వైరస్ నివారణకు సంబంధించిన అన్ని వివరాలు వాట్సాప్ ద్వారా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ వాట్సాప్ నెంబర్ను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణ చర్యలు, ఇతర సందేహాలకు సమాధానాలు ఈ వాట్సాప్ బోట్ ద్వారా తెలుసుకోవచ్చని కేంద్రం స్పష్టంచేసింది.
ఢిల్లీ అల్లర్ల వెనుక బీజేపి-ఆప్ : కాంగ్రెస్ పార్టీ
ఢిల్లీలో అల్లర్లు, హింస వెనుక బీజేపి, ఆమ్ ఆద్మీ పార్టీ హస్తం ఉన్నాయని కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. బీజేపి, ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలిపిందని.. లేదంటే ఈ అల్లర్లకు ప్రధాన కారకులైన తాహీర్ హుస్సేన్, కపిల్ మిశ్రాలపై ఢిల్లీ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని కర్ణాటక కాంగ్రెస్ నిలదీసింది.
Sachin Tendulkar`s first love video : సచిన్ టెండుల్కర్ ఫస్ట్ లవ్ వీడియో
ప్రేమికుల రోజు సందర్భంగా టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తన ఫస్ట్ లవ్ వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సచిన్ టెండుల్కర్ తన సతీమణి అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ సచిన్ షేర్ చేసుకున్న ఫస్ట్ లవ్ వీడియోలో అంజలితో లవ్ స్టోరి లేదు. మరి ఆ వీడియోలో ఉంది ఇంకెవరు అనుకుంటున్నారా ? అయితే, ఇదిగో ఈ వీడియోను చూసేయండి.
Delhi weather updates : గజగజ వణికిస్తున్న చలి.. భారీగా పెరుగుతున్న గాలి కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో జనవరి నెలలో మొత్తం 34.5 మి.మీ వర్షాలు నమోదయ్యాయని.. గత పదేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని స్కైమెట్ వాతావరణ నివేదిక వెల్లడించింది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీలో గురువారం 17.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఢిల్లీలో ఈసారి నెలవారీ 19.1 మి.మీ. సగటు వర్షపాతాన్ని మించిన వర్షపాతం నమోదైనట్టు స్కైమెట్ పేర్కొంది. గురువారం రాత్రి కురిసిన వర్షంతో శుక్రవారం ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. దేశ రాజధానిని పొగమంచు కప్పేయగా.. గాలిలో కాలుష్యం లెవెల్స్ కూడా భారీగా పెరిగాయి.
దీపికా పదుకునె జేఎన్యూకు వెళ్లడంపై స్పందించిన కంగనా రనౌత్
జేఎన్యూలో విద్యార్థులపై దాడి, హింస ఘటనల అనంతరం బాధిత విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ దీపికా పదుకునె ఇటీవల జేఎన్యూకు వెళ్లడం ఎంత చర్చనియాంశమైందో అందరికీ తెలిసిందే. జేఎన్యూలో దాడి వెనుక ఎవరున్నారనే చర్చల నేపథ్యంలో బాలీవుడ్ నటి దీపికా పదుకునె ఆ విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించి వారిని పరామర్శించడం పతాకశీర్షికలకెక్కింది.