Bigg Boss 7 Telugu latest Promo: బిగ్బాస్ తెలుగు 7వ సీజన్ హోరాహోరీగా సాగుతోంది. పవర్ అస్త్రా కోసం కంటెస్టెంట్స్ గట్టిగానే కష్టపడుతున్నారు. ఇప్పటికే ఆట సందీప్, శివాజీ పవర్ అస్త్రా గెలుచుకోగా.. మూడో పవర్ అస్త్రా కోసం ప్రిన్స్ యావర్, ప్రియాంకా జైన్, శోభా శెట్టి పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో 19వ రోజు ఈ ముగ్గురిలో పవర్ అస్త్రాను ఎవరు గెలుచుకుంటారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. బిగ్ బాస్ నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో ప్రియాంకకు, యావర్ కు పెద్ద గొడవ జరిగినట్లు చూపించారు. అసలు ఇవాళ చూపించిన ప్రోమోల్లో ఏముందంటే..
మూడో పవర్ అస్త్రాను సాధించే కంటెండర్షిప్ కోసం ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ రేసులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ ముగ్గురిలో ఎవరు వీకెస్ట్ కంటెండరో మిగిలిన ఇద్దరు నిర్ణయించేలా ఓ గేమ్ పెట్టాడు పెద్దయ్య. యావర్, శోభా, ప్రియాంక బొమ్మలు పెట్టి.. వీకెస్ట్ అనుకునే వారి బొమ్మపై సుత్తితో కొట్టాలని కంటెస్టెంట్లకు బిగ్ బాస్ చెబుతాడు. ఈ క్రమంలో తనతోనే ఇమ్యూనిటీ కోసం టాస్క్ ఆడేందుకు ప్రియాంక ఇష్టపడుతోందని శోభా చెబుతోంది. దీంతో లేడీస్తోనే ప్రియాంక టాస్క్ ఆడుతుందా అని బిస్బాగ్ను యావర్ అడుగుతాడు. ఈ సమయంలో యావర్, ప్రియాంక మధ్య పెద్ద గొడవే జరుగుతోంది. ప్రియాంకకు వేలు చూపిస్తూ యావర్ గట్టిగా అరుస్తాడు. యావర్ ను సందీప్ వారిస్తాడు. దీంతో ఆగ్రహం చెందిన యావర్ తన బొమ్మనే సుత్తితో పగలగొట్టడాన్ని మెుదటి ప్రోమోలో చూపించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook