Trivikram SSMB28 : త్రివిక్రమ్‌ ప్రవర్తనలో మార్పులు.. మహేష్‌ బాబు దెబ్బకు మారిపోయిన మాటల మాంత్రికుడు

Trivikram behavior in SSMB28 త్రివిక్రమ్ ఇప్పుడు సినిమా తీసి చాలా కాలమే అవుతోంది. దర్శకుడి త్రివిక్రమ్ వచ్చి దాదాపు రెండున్నరేళ్లకు పైగా అవుతోంది. మధ్యలో త్రివిక్రమ్ స్క్రిప్టులు రాస్తూ పవన్ కళ్యాణ్ సినిమాలకు పని చేస్తూ ఉన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2023, 01:35 PM IST
  • మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ అప్డేట్
  • SSMB 28 మీద నిర్మాత నాగవంశీ కామెంట్స్
  • మహేష్‌ దెబ్బకు మారిపోయిన త్రివిక్రమ్
Trivikram SSMB28 : త్రివిక్రమ్‌ ప్రవర్తనలో మార్పులు.. మహేష్‌ బాబు దెబ్బకు మారిపోయిన మాటల మాంత్రికుడు

Trivikram behavior in SSMB28 సూపర్ స్టార్ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌కు తెలుగులో ఉండే క్రేజ్ వేరు. వారిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా ఇప్పటికీ ఎప్పటికీ అందరికీ ఫేవరేట్ సినిమాలే. వెండితెరపై చేయని మ్యాజిక్.. బుల్లితెరపై ఈ రెండు చిత్రాలు చేశాయి. ఈ సినిమాలు స్మాల్ స్క్రీన్ మీద ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి. కొన్ని వందల సార్లు ఈ సినిమాలను టీవీల్లో వేసినా మంచి రేటింగ్స్ సాధిస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు వీరి కాంబోలో హ్యాట్రిక్ చిత్రం రాబోతోంది. ఈ మూవీ షూటింగ్ ఇది వరకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓ ఫైట్ సీక్వెన్స్ కూడా షూట్ చేశారు. అయితే ఏమైందో ఏమో గానీ ఆ సినిమాను, కథను పక్కన పెట్టేశాడు త్రివిక్రమ్. ఫైట్ మాస్టర్లకు, మహేష్‌ బాబుకు మధ్య సరిగ్గా కెమిస్ట్రీ కుదర్లేదని, మహేష్‌ బాబు హర్ట్ అయ్యాడనే టాక్ వచ్చింది. అయితే త్రివిక్రమ్ పూర్తి కథ కూడా చెప్పలేదని, ఆ కథ మహేష్‌ బాబుకు సరిగ్గా నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ పక్కనపెట్టేశాడని టాక్.

త్రివిక్రమ్‌ మళ్లీ కొత్త కథను రెడీ చేశాడని, అది కూడా పూర్తి స్క్రిప్ట్ వినిపిస్తే గానీ సెట్స్ మీదకు వెళ్లొద్దని మహేష్‌ బాబు కండీషన్ పెట్టాడట. అందుకే మొదటి సారి త్రివిక్రమ్ తన పద్దతిని మార్చుకున్నాడట. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయ్యాక, మహేష్‌ బాబుకు నెరెట్ చేశాకే సెట్స్ మీదకు వెళ్తున్నాడట.

అయితే ఇంతకు ముందు త్రివిక్రమ్ పూర్తి స్క్రిప్ట్ చెప్పేవాడ కాదట. సెట్స్‌లోనే ఎన్నో మార్పులు చేర్పులు చేసేవాడట. ఇది వరకు అయితే ఏదో ఒక సీన్, డైలాగ్ చెప్పి ప్రాజెక్ట్ ఓకే చేయించుకునేవాడట. కానీ ఇప్పుడు మాత్రం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేశాకే సెట్స్ మీదకు వెళ్లేందుకు త్రివిక్రమ్ సిద్దమయ్యాడు.

జనవరి 18న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందట. ఆగస్ట్ 11న ఈ సినిమాను రిలీజ్ చేస్తారట. ఈ చిత్రంలో శ్రీలీల, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా ఫిక్స్ అయ్యారని నిర్మాత నాగవంశీ రీసెంట్‌గా ప్రకటించాడు. మొత్తానికి మహేష్ బాబు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలానే సినిమా ఉండబోతోందట.

Also Read:  Upasana Motherhood : ఈ సంక్రాంతికి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్

Also Read: Nandamuri Balakrishna Controversy : ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.. క్షమాపణలు కోరిన బాలయ్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News