50 మంది విద్యార్థులతో వెళ్తూ లోతైన లోయలో పడిన బస్సు

50 మంది విద్యార్థులతో వెళ్తూ లోతైన లోయలో పడిన బస్సు

Last Updated : Dec 22, 2018, 07:48 PM IST
50 మంది విద్యార్థులతో వెళ్తూ లోతైన లోయలో పడిన బస్సు

అహ్మెదాబాద్: గుజరాత్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 50 మంది విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఓ బస్సు రోడ్డు పక్కనే వున్న లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనకు సంబంధించి ఏఎన్ఐ వెల్లడించిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్టు తెలుస్తోంది. డంగ్ జిల్లాలోని మహల్-బర్దిపడ మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన గురించి సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు ముమ్మరం చేసింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి వుంది.

Trending News