India Corona Cases Today: ఇండియాలో తాజాగా లక్ష కరోనా కేసులు, 3.5 లక్షలకు చేరువలో COVID-19 మరణాలు

India Corona Cases Today: పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్‌డౌన్, కర్ఫూ విధించడంతో కరోనా వ్యాప్తి కొంతమేర కట్టడి అయింది. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లాంటి ఇన్‌ఫెక్షన్ కేసులు వస్తున్నా, వైద్యులు ఎంతగానో శ్రమించి కరోనా బాధితులను కోలుకునేలా చేస్తున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 7, 2021, 11:14 AM IST
  • భారత్‌లో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు, మరణాలు
  • గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,00,636 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
  • దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజులో 1,74,399 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు
India Corona Cases Today: ఇండియాలో తాజాగా లక్ష కరోనా కేసులు, 3.5 లక్షలకు చేరువలో COVID-19 మరణాలు

India Corona Cases Today: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్‌డౌన్, కర్ఫూ విధించడంతో కరోనా వ్యాప్తి కొంతమేర కట్టడి అయింది. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లాంటి ఇన్‌ఫెక్షన్ కేసులు వస్తున్నా, వైద్యులు ఎంతగానో శ్రమించి కరోనా బాధితులను కోలుకునేలా చేస్తున్నారు.

భారత్‌లో గడిచిన 24 గంటల్లో 1,00,636 మందికి కరోనా సోకింది. దీంతో దేశంలో ఇప్పటివరకూ మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,89,09,975 (2 కోట్ల 89 లక్షల 9వేల 9 వందల 75)కు చేరుకుంది. కోవిడ్-19 (COVID-19) మరణాలు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 2,427 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. ఇండియాలో ఇప్పటివరకూ నమోదైన కరోనా మరణాల సంఖ్య 3,49,186కు పెరిగింది. కరోనా రికవరీ రేటు 94 శాతానికి చేరగా, పాజిటివిటీ రేటు భారీగా తగ్గింది. 

Also Read: AIIMS Delhi Covaxin Trials: నేటి నుంచి చిన్నారులపై Bharat Biotech క్లినికల్ ట్రయల్స్

అదే సమయంలో దేశ వ్యాప్తంగా 1,74,399 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ దేశంలో 2,71,59,180 మంది కోవిడ్19 మహమ్మారిని జయించారు. దేశంలో ప్రస్తుతం 14,01,609 యాక్టివ్ కేసులున్నాయి. 23,27,86,482 కరోనా వైరస్ (CoronaVirus) టీకాలు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Also Read: Indian Covid-19 Variants: ఇండియన్ కోవిడ్-19 వేరియంట్స్‌కు Kappa మరియు Deltaగా నామకరణం చేసిన WHO
 
ఆదివారం నాడు 15,87,589 (15 లక్షల 87 వేల 5 వందల 89) శాంపిల్స్‌కు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేశారు. గత ఏడాది నుంచి జూన్ 6వ తేదీ వరకు మొత్తం  36,63,34,111 (36 కోట్ల 63 లక్షల 34 వేల 111) శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News