India Covid-19: తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న రికవరీ

భారత్‌ ( India ) లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు.. వందల సంఖ్యలో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి 50వేలకు తక్కువగా నమోదవుతున్న కేసులు కాస్త.. నిన్న 40వేలకు తక్కువగా నమోదవుతున్నాయి. ఇంత భారీ మొత్తంలో కేసులు తగ్గడం ఇదే మొదటిసారి.

Last Updated : Nov 3, 2020, 10:18 AM IST
India Covid-19: తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న రికవరీ

India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌ ( India ) లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు.. వందల సంఖ్యలో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి 50వేలకు తక్కువగా నమోదవుతున్న కేసులు కాస్త.. నిన్న 40వేలకు తక్కువగా నమోదవుతున్నాయి. ఇంత భారీ మొత్తంలో కేసులు తగ్గడం ఇదే మొదటిసారి. ఇదిలాఉంటే.. గత కొన్నిరోజుల క్రితం నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా సగానికి సగం భారీగా తగ్గింది. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులకన్నా రికవరీ రేటు నిత్యం గణనీయంగానే పెరుగుతూనే ఉంది.  

గత 24 గంటల్లో సోమవారం ( నవంబరు 2న ) దేశవ్యాప్తంగా కొత్తగా.. 38,310 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 490 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,67,623 కి చేరగా మరణాల సంఖ్య 1,23,097 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Bihar Assembly Election 2020: రెండో దశ పోలింగ్‌ ప్రారంభం.. బరిలో తేజస్వీ

అయితే.. సోమవారం కరోనాతో 58,323 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న వారి సంఖ్య 76,03,121 కి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 5,41,405 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది. ఇదిలాఉంటే.. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 91.96 శాతం ఉండగా.. మ‌ర‌ణాల రేటు 1.49 శాతం, యాక్టివ్ కేసుల రేటు 6.55 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. Also read: TN Krishnan: తుదిశ్వాస విడిచిన వయోలిన్‌ విధ్వాంసుడు టీఎన్‌ కృష్ణన్‌

అయితే సోమవారం దేశవ్యాప్తంగా 10,46,247 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి నవంబరు 2 వరకు మొత్తం 11,17,89,350 నమూనాలను దేశంలో పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది.

 

Bihar Assembly Election: వ్యాక్సిన్ ఉచితం సరైందే: ఈసీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News